ఐలాస్ పేరిట నకిలీ లేక! దోషులను శిక్షించాలి! డి హరినాథ్
ఐలాస్ పేరిట నకిలీ లేక! దోషులను శిక్షించాలి! డి హరినాథ్
GADDAM JAGANMOHAN REDDY
మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తినిర్మల్ కుమార్ 50 లక్షల లంచం తీసుకున్నారని ఐలాజ్ పేరిట నకిలీ లేక విడుదల చేసిన దోషులపై చర్యలు చేపట్టాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ డిమాండ్ చేశారు. మద్రాస్ హైకోర్టు గౌరవనీయ న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్ కుమార్ కు ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ (ఐలాజ్)పేరుతో పంపిన లేఖ నకిలీదని ఐలాజ్ కేంద్ర కమిటీ పత్రికా ప్రకటనలో తెలియజేసిందని దోషులపై చర్యలు తీసుకోవాలని హరినాథ్ కోరారు. ఐలాజ్ పేరుతో మద్రాస్ హైకోర్టు సీనియర్ న్యాయవాది ద్వారా అనుకూలమైన ఆర్డర్ పొందడానికి క్లయింటు నుండి 50 లక్షలు లంచం తీసుకున్నారని ఐలాస్ పేరుతో అసత్య ఆరోపణకు పూనుకోవటం నీతి బాహ్యమైన చర్య అని హరినాథ్ అన్నారు.ఈ రిపోర్ట్ పలితంగా జస్టిస్ నిర్మల్ కుమార్ ఆ కేసు నుండి తప్పుకున్నారన్నారు.మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమగ్రంగా దీనిపైవిచారించి తగు చర్యలు తీసుకోవాలని తద్వారా అసత్య ఆరోపణలు చేసే వారికి గుణపాఠం చెప్పినట్లు అవుతుందని హరినాథ్ అన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి