ఐక్యమత్యంతో కదిలి కాంగ్రెస్ విజయానికి తోడ్పడండి.....
ఐక్యమత్యంతో కదిలి కాంగ్రెస్ విజయానికి తోడ్పడండి.....
Harish HS
ఐక్యమత్యంతో కదిలి కాంగ్రెస్ విజయానికి తోడ్పడండి.....
లక్ష్యం ఒక్కటే పార్టీ గెలుపే ముఖ్యం: కాంగ్రెస్ సమన్వయకర్తలు...
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేయాలని మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్తలు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, ముత్తవరపు పాండురంగారావు లు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని 14వ వార్డు రామినేని శ్రీనివాసరావు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. అభ్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదని, పార్టీ గెలుపు కోసమే ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలు అండగా ఉంటారని, భవిష్యత్తులో తప్పక న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వార్డు ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో రామినేని శ్రీనివాసరావు,కందుల కోటేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి, భద్రారెడ్డి,ఈదుల కృష్ణయ్య, పట్టాభి రెడ్డి ముత్తవరపు రామారావు, మేకల వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.....
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి