ఐఎన్టీయూసీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా గోలి శ్రావణి రెడ్డి
ఐఎన్టీయూసీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా గోలి శ్రావణి రెడ్డి
Editor Desk
నల్గొండ టౌన్, న్యూస్టుడే: నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఐఎన్టీయూసీ మహిళా అధ్యక్షురాలిగా గోలి శ్రావణి రెడ్డి నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతంలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. శ్రావణి రెడ్డి నాయకత్వంలో జిల్లాలో ఐఎన్టీయూసీ మహిళా విభాగం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో జాతీయ ఆర్గనైజర్ కార్యదర్శి ఎర్రగోని నాగన్న, రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ వనమల రమేష్, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్, బెజవాడ రవికుమార్, కట్ట శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
తనపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గోలి శ్రావణి రెడ్డి తెలిపారు. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి