Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:55 AM

ఐఎన్‌టీయూసీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా గోలి శ్రావణి రెడ్డి

ఐఎన్‌టీయూసీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా గోలి శ్రావణి రెడ్డి

ఐఎన్‌టీయూసీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా గోలి శ్రావణి రెడ్డి
20-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ టౌన్‌, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఐఎన్‌టీయూసీ మహిళా అధ్యక్షురాలిగా గోలి శ్రావణి రెడ్డి నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతంలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. శ్రావణి రెడ్డి నాయకత్వంలో జిల్లాలో ఐఎన్‌టీయూసీ మహిళా విభాగం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో జాతీయ ఆర్గనైజర్ కార్యదర్శి ఎర్రగోని నాగన్న, రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ వనమల రమేష్, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్‌, బెజవాడ రవికుమార్‌, కట్ట శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

తనపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గోలి శ్రావణి రెడ్డి తెలిపారు. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

ఐఎన్‌టీయూసీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా గోలి శ్రావణి రెడ్డి

Article Image

నల్గొండ టౌన్‌, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఐఎన్‌టీయూసీ మహిళా అధ్యక్షురాలిగా గోలి శ్రావణి రెడ్డి నియమితులయ్యారు. బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతంలో మహిళల పాత్ర కీలకమని పేర్కొన్నారు. శ్రావణి రెడ్డి నాయకత్వంలో జిల్లాలో ఐఎన్‌టీయూసీ మహిళా విభాగం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో జాతీయ ఆర్గనైజర్ కార్యదర్శి ఎర్రగోని నాగన్న, రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ వనమల రమేష్, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్‌, బెజవాడ రవికుమార్‌, కట్ట శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

తనపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గోలి శ్రావణి రెడ్డి తెలిపారు. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News