PRINT TIME: April 11, 2026 01:58 PM
ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ కౌన్సిలర్లకు ఘన సన్మానం
ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ కౌన్సిలర్లకు ఘన సన్మానం
February 23, 2026 05:22 PM
259 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
ప్రజాసేవలో ఆదర్శంగా నిలవాలని ఐఎన్ టియుసి మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల గణేష్ కుమార్ ఆకాంక్ష
చౌటుప్పల్ మున్సిపాలిటీలో సోమవారం 8వ వార్డు కౌన్సిలర్ బద్రి గాలయ్య, 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఐఎన్టీయూసీ మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల గణేష్ కుమార్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లను శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు.
ఈ సందర్భంగా ముత్యాల గణేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల విశ్వాసంతో ఎన్నికైన ప్రజాప్రతినిధులు తమ వార్డుల సమగ్ర అభివృద్ధికి కృషి చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు బోయ రామచందర్, కంచర్ల జంగయ్య, చామట్ల శ్రీనివాస్, లగ్గొని వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి