Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:40 AM

ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం.ఏ. ఖైసర్ నియామకం

ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం.ఏ. ఖైసర్ నియామకం

ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం.ఏ. ఖైసర్ నియామకం
27-01-2026 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ (ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి) సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మొహమ్మద్ అబ్దుల్ ఖైసర్‌ను నియమించినట్లు సంస్థ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు తెలిపారు.

బషీరాబాద్‌లో నిర్వహించిన ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి–2026 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించి ఖైసర్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నవోదయ సిద్దు మాట్లాడుతూ, మానవ హక్కుల పరిరక్షణ రంగంలో ఖైసర్ అందించిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయనకు ఉన్న అనుభవం, అంకితభావాన్ని గుర్తించి ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలిపారు.

సంగారెడ్డి జిల్లాలో మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, బాధితులకు న్యాయం అందేలా నిరంతరం కృషి చేయాలని ఆయన సూచించారు.కొత్త బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఖైసర్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించినందుకు సంస్థ చైర్మన్ నవోదయ సిద్దు, రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ డిగ్గే బాబు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఓంప్రకాష్‌లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పూర్తి అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు. మానవ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా జిల్లాలో సంస్థను మరింత బలోపేతం చేసి, ప్రజలకు న్యాయం అందేలా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

Sthanikam

ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం.ఏ. ఖైసర్ నియామకం

Article Image

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ (ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి) సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా మొహమ్మద్ అబ్దుల్ ఖైసర్‌ను నియమించినట్లు సంస్థ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు తెలిపారు.

బషీరాబాద్‌లో నిర్వహించిన ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి–2026 సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించి ఖైసర్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నవోదయ సిద్దు మాట్లాడుతూ, మానవ హక్కుల పరిరక్షణ రంగంలో ఖైసర్ అందించిన సేవలు ప్రశంసనీయమని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయనకు ఉన్న అనుభవం, అంకితభావాన్ని గుర్తించి ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలిపారు.

సంగారెడ్డి జిల్లాలో మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, బాధితులకు న్యాయం అందేలా నిరంతరం కృషి చేయాలని ఆయన సూచించారు.కొత్త బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఖైసర్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించినందుకు సంస్థ చైర్మన్ నవోదయ సిద్దు, రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ డిగ్గే బాబు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఓంప్రకాష్‌లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఐ.ఎన్.హెచ్.ఆర్.పి.సి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పూర్తి అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు. మానవ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా జిల్లాలో సంస్థను మరింత బలోపేతం చేసి, ప్రజలకు న్యాయం అందేలా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News