PRINT TIME: April 11, 2026 01:50 PM
ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
January 11, 2026 06:42 PM
35 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలు 2026 జనవరి 25 నుంచి 28 వరకు హైదరాబాద్లో నిర్వహించనున్నట్లు ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి తెలిపారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఆదివారం సూర్యాపేటలో వాల్ పోస్టర్ను ఆవిష్కరిస్తూ ఆమె మాట్లాడుతూ, తెలంగాణలో తొలిసారిగా హైదరాబాద్లో ఐద్వా ఆల్ ఇండియా మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. జనవరి 25న లక్షలాదిమందితో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మహిళల హక్కులు, భద్రత, ఉపాధి, విద్య తదితర సమస్యలపై మహాసభల్లో చర్చ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి