Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గంజాయితో ఐదుగురు అరెస్ట్ భూ వివాదాలకు చెక్… భూభారతి పోర్టల్‌కు శ్రీకారం “టికెట్ ఉంటే సీటు తప్పనిసరి… ఇది ప్రతి పౌరుని హక్కు!” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 01, 2026 09:25 PM

ఐఐటి-జేఈఈ/నీట్/ఎంసెట్‌కు ఉచిత మెగా గ్రాండ్ టెస్ట్

ఐఐటి-జేఈఈ/నీట్/ఎంసెట్‌కు ఉచిత మెగా గ్రాండ్ టెస్ట్

ఐఐటి-జేఈఈ/నీట్/ఎంసెట్‌కు ఉచిత మెగా గ్రాండ్ టెస్ట్
April 01, 2026 06:57 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లి వస్తూ, హాస్టళ్లలో ఉంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని రత్నం ఫౌండేషన్ ముందడుగు వేసింది. మునుగోడు నియోజకవర్గ విద్యార్థుల కోసం చౌటుప్పల్ కేంద్రంగా ఐఐటి-జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు 45 రోజులపాటు ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించింది.

ఈ శిక్షణలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు వివిధ సబ్జెక్టులపై ప్రతిరోజూ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు నాణ్యమైన మార్గదర్శకత్వం అందిస్తున్నారు. కోచింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రత్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా గ్రాండ్ టెస్ట్‌ను ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది.

రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఏప్రిల్ 10గా నిర్ణయించారు.

బహుమతులు:

మొదటి బహుమతి –రూ10,016

రెండవ బహుమతి – రూ 5,016

వివరాల కోసం రత్నం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఊదరి మల్లేష్‌ 9000163356, 9133016336 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News