ఐఐటి-జేఈఈ/నీట్/ఎంసెట్కు ఉచిత మెగా గ్రాండ్ టెస్ట్
ఐఐటి-జేఈఈ/నీట్/ఎంసెట్కు ఉచిత మెగా గ్రాండ్ టెస్ట్
K.RAVI
గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వెళ్లి వస్తూ, హాస్టళ్లలో ఉంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని రత్నం ఫౌండేషన్ ముందడుగు వేసింది. మునుగోడు నియోజకవర్గ విద్యార్థుల కోసం చౌటుప్పల్ కేంద్రంగా ఐఐటి-జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు 45 రోజులపాటు ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించింది.
ఈ శిక్షణలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు వివిధ సబ్జెక్టులపై ప్రతిరోజూ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు నాణ్యమైన మార్గదర్శకత్వం అందిస్తున్నారు. కోచింగ్కు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రత్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా గ్రాండ్ టెస్ట్ను ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది.
రిజిస్ట్రేషన్కు చివరి తేదీ ఏప్రిల్ 10గా నిర్ణయించారు.
బహుమతులు:
మొదటి బహుమతి –రూ10,016
రెండవ బహుమతి – రూ 5,016
వివరాల కోసం రత్నం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఊదరి మల్లేష్ 9000163356, 9133016336 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి