Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:21 AM

ఐఐటి-జేఈఈ/నీట్/ఎంసెట్‌కు ఉచిత మెగా గ్రాండ్ టెస్ట్

ఐఐటి-జేఈఈ/నీట్/ఎంసెట్‌కు ఉచిత మెగా గ్రాండ్ టెస్ట్

ఐఐటి-జేఈఈ/నీట్/ఎంసెట్‌కు ఉచిత మెగా గ్రాండ్ టెస్ట్
April 01, 2026 06:57 PM 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లి వస్తూ, హాస్టళ్లలో ఉంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని రత్నం ఫౌండేషన్ ముందడుగు వేసింది. మునుగోడు నియోజకవర్గ విద్యార్థుల కోసం చౌటుప్పల్ కేంద్రంగా ఐఐటి-జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు 45 రోజులపాటు ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించింది.

ఈ శిక్షణలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు వివిధ సబ్జెక్టులపై ప్రతిరోజూ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు నాణ్యమైన మార్గదర్శకత్వం అందిస్తున్నారు. కోచింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రత్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా గ్రాండ్ టెస్ట్‌ను ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది.

రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఏప్రిల్ 10గా నిర్ణయించారు.

బహుమతులు:

మొదటి బహుమతి –రూ10,016

రెండవ బహుమతి – రూ 5,016

వివరాల కోసం రత్నం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఊదరి మల్లేష్‌ 9000163356, 9133016336 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News