ఐఐటీ, నీట్ మెగా గ్రాండ్ టెస్ట్ కరపత్రం ఆవిష్కరణ
ఐఐటీ, నీట్ మెగా గ్రాండ్ టెస్ట్ కరపత్రం ఆవిష్కరణ
K.RAVI
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: తహసీల్దార్
స్థానిక పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ రత్నం ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమం అభినందనీయమని చౌటుప్పల్ తహసీల్దార్ పేర్కొన్నారు. గురువారం చౌటుప్పల్లో రత్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26న నిర్వహించ తలపెట్టిన ఐఐటి-జేఈఈ/నీట్/ఎంసెట్ ఉచిత మెగా గ్రాండ్ టెస్ట్ అవగాహన కరపత్రాన్ని ఆమె ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక, వైద్య విద్యా కోర్సులకు ఉన్న ప్రాధాన్యతను విద్యార్థులు గుర్తించాలని సూచించారు. రత్నం ఫౌండేషన్ వారు అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని, కష్టపడి చదివి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. మెగా గ్రాండ్ టెస్ట్ ద్వారా పరీక్షలపై అవగాహన పెంచుకోవాలని, పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణ వివరాలను గ్రాండ్ టెస్ట్ ఉద్దేశాన్ని నిర్వాహకులు వివరించారు.ఈ కార్యక్రమంలో యు. మల్లేష్ (రత్నం ఫౌండేషన్ చైర్మన్)దబ్బటి శేఖర్ (యాదాద్రి ఆర్.టి.ఐ. జిల్లా అధ్యక్షుడు)రామయ్య, మల్లేష్, సనా, అధ్యాపక బృందం
మహేందర్, ఇతర ఫౌండేషన్ సభ్యులు,విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి