Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్వతాపురం రోడ్డుకు భూమిపూజ.. రూ.30 లక్షలతో బీటీ రోడ్డు ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 07:05 PM

ఐఐటీ, నీట్ మెగా గ్రాండ్ టెస్ట్ కరపత్రం ఆవిష్కరణ

ఐఐటీ, నీట్ మెగా గ్రాండ్ టెస్ట్ కరపత్రం ఆవిష్కరణ

ఐఐటీ, నీట్ మెగా గ్రాండ్ టెస్ట్ కరపత్రం ఆవిష్కరణ
April 09, 2026 05:33 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి: తహసీల్దార్‌

స్థానిక పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ రత్నం ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమం అభినందనీయమని చౌటుప్పల్ తహసీల్దార్ పేర్కొన్నారు. గురువారం చౌటుప్పల్‌లో రత్నం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26న నిర్వహించ తలపెట్టిన ఐఐటి-జేఈఈ/నీట్/ఎంసెట్ ఉచిత మెగా గ్రాండ్ టెస్ట్ అవగాహన కరపత్రాన్ని ఆమె ఆవిష్కరించారు.​ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక, వైద్య విద్యా కోర్సులకు ఉన్న ప్రాధాన్యతను విద్యార్థులు గుర్తించాలని సూచించారు. రత్నం ఫౌండేషన్ వారు అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని, కష్టపడి చదివి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించాలని ఆమె ఆకాంక్షించారు. మెగా గ్రాండ్ టెస్ట్ ద్వారా పరీక్షలపై అవగాహన పెంచుకోవాలని, పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న ఉచిత శిక్షణ వివరాలను గ్రాండ్ టెస్ట్ ఉద్దేశాన్ని నిర్వాహకులు వివరించారు.ఈ కార్యక్రమంలో ​యు. మల్లేష్ (రత్నం ఫౌండేషన్ చైర్మన్)​దబ్బటి శేఖర్ (యాదాద్రి ఆర్.టి.ఐ. జిల్లా అధ్యక్షుడు)రామయ్య, మల్లేష్, సనా, అధ్యాపక బృందం

​మహేందర్, ఇతర ఫౌండేషన్ సభ్యులు,విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News