Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:50 PM

ఆగిరిపల్లి హత్య కేసులో 12 ఏళ్లుగా పరారీలో ఉన్న ముద్దాయి అరెస్ట్

ఆగిరిపల్లి హత్య కేసులో 12 ఏళ్లుగా పరారీలో ఉన్న ముద్దాయి అరెస్ట్

ఆగిరిపల్లి హత్య కేసులో 12 ఏళ్లుగా పరారీలో ఉన్న ముద్దాయి అరెస్ట్
February 23, 2026 02:07 PM 144 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎస్‌ఐ కె. శుభశేఖర్ చాకచక్యంతో పట్టుబడిన ఏ-3 నిందితుడు

ఆగిరిపల్లి : పరిధిలో నమోదైన హత్య కేసులో గత 12 సంవత్సరాలుగా పరారీలో ఉన్న ముద్దాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైమ్ నం. 20/2009, సెక్షన్లు 302, 120(బి) ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ కింద నమోదు అయిన కేసులో ఏ-3 నిందితుడు అలవాల బాబ్జీ @ బాబీని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, గుంటూరు జిల్లాకు చెందిన అలవాల బాబ్జీ (తండ్రి: నరసింహమూర్తి) 2014లో బెయిల్‌పై విడుదలై, అనంతరం కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు.

కేసు నమోదు సమయంలో ఆధార్ వంటి ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో ముద్దాయి తన పేరు మారుస్తూ, ముద్దు పేర్లతో జీవనం సాగించినట్లు విచారణలో తేలింది. అలవాల వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరావు తదితర పేర్లతో గుర్తింపును మార్చుకుంటూ పోలీసులను తప్పించుకుంటూ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ, ఎస్‌ఐ కె. శుభశేఖర్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి గుంటూరు పరిసర ప్రాంతాల్లో విస్తృత గాలింపు చేపట్టారు. గుంటూరు సమీపంలోని దాసరిపాలెం గ్రామంలో అలవాల వెంకటేశ్వర్లు పేరుతో నివసిస్తున్న వ్యక్తిపై అనుమానం వ్యక్తమవడంతో పోలీసులు నిఘా పెట్టారు. పోలీసుల కదలికలను గమనించిన అతను ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది.

నిరంతర గాలింపు చర్యలలో భాగంగా గుంటూరు పట్టణంలోని పాత సుజాత కాన్వెంట్, శనివారపేట ప్రాంతంలో సంచరిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అతడే అలవాల బాబ్జీ @ బాబీ @ వెంకటేశ్వరరావు @ వెంకటేశ్వర్లు అని నిర్ధారించారు.

దాదాపు 12 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకున్న పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరచి తదుపరి చట్టపరమైన చర్యలు చేపడతామని ఎస్‌ఐ కె. శుభశేఖర్ తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News