అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
K.RAVI
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో గల శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో ఆదివారం శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ వినయ్ పాల్గొన్నారు.బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం 5 గంటలకు సుప్రభాతం, 8 గంటలకు గణపతి పూజ, ఉదయం 10.30 గంటలకు ఎదుర్కోలు కార్యక్రమం, ఉదయం 11.30 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాయంత్రం 5 గంటలకు రథోత్సవం, రాత్రి 8 గంటలకు మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు నాగిళ్ల రామచంద్రం, ఉపాధ్యక్షులు చింతల ప్రభాకర్ రెడ్డి, ఊదరి శ్యాంసుందర్, ప్రధాన కార్యదర్శి ఊదరి శంకర్, కోశాధికారి ఎలక రాజునాగరాజు (మల్లేష్), సహాయ కార్యదర్శి ఉష్కాగుల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి తోర్పునూరి నరసింహ గౌడ్, ఆరుట్ల లింగస్వామి, సంస్కృతిక కార్యదర్శులు తోర్పునూరి మల్లేష్ గౌడ్, గట్టు పవన్, కార్యవర్గ సభ్యులు నకిరేకంటి శ్రీశైలం, ఊదరి మారయ్య, ఊదరి యాదయ్య, చెవగొని మహేష్, జక్క జక్కర్తి శేఖర్, నల్ల పర్వతాలు, ఉయ్యాల పల్లవి, గంగిరెడ్డి నాగలక్ష్మి, గౌరవ సలహాదారులు చింతల దామోదర్ రెడ్డి, బత్తుల శ్రీశైలం గౌడ్, మంచికంటి భాస్కర్ గుప్తా, గుజ్జల సురేందర్ రెడ్డి, అన్నెమోని గోవిందరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు బత్తుల విప్లవ గౌడ్, కాసుల వెంకటేష్, బాల్యం వెంకటాచలపతి, నల్ల గణేష్, ఆలయ అర్చకులు సంతోష్ కుమార్ శాస్త్రి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి