Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:56 PM

అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
March 14, 2026 06:26 PM 118 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

భక్తిశ్రద్ధలతో బ్రహ్మోత్సవాలు… పంచామృత అభిషేకం, సహస్రనామ పుష్పార్చన

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో ఉన్న శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో ఆదివారం రోజు శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 5 గంటలకు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం ఉదయం 8 గంటలకు గణపతి పూజ, 8.30 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష పంచామృత అభిషేకం, సహస్రనామ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు ద్వజారోహణం, హోమం నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంటకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు నాగిళ్ల రామచంద్రం, ఉపాధ్యక్షులు చింతల ప్రభాకర్ రెడ్డి, ఊదరి శ్యాంసుందర్, ప్రధాన కార్యదర్శి ఊదరి శంకర్, కోశాధికారి ఎలక రాజునాగరాజు (మల్లేష్), సహాయ కార్యదర్శి ఉష్కాగుల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి తోర్పునూరి నరసింహ గౌడ్, ఆరుట్ల లింగస్వామి, సంస్కృతిక కార్యదర్శులు తోర్పునూరి మల్లేష్ గౌడ్, గట్టు పవన్, కార్యవర్గ సభ్యులు నకిరేకంటి శ్రీశైలం, ఉదరి మారయ్య, ఉదరి యాదయ్య, చెవగొని మహేష్, జక్క జక్కర్తి శేఖర్, నల్ల పర్వతాలు, ఉయ్యాల పల్లవి, గంగిరెడ్డి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గౌరవ సలహాదారులు చింతల దామోదర్ రెడ్డి, బత్తుల శ్రీశైలం గౌడ్, మంచికంటి భాస్కర్ గుప్తా, గుజ్జల సురేందర్ రెడ్డి, అన్నెమోని గోవిందరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు బత్తుల విప్లవ గౌడ్, కాసుల వెంకటేష్, బాల్యం వెంకటాచలపతి, నల్ల గణేష్, ఆలయ అర్చకులు సంతోష్ కుమార్ శాస్త్రి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News