Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:14 AM

అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
March 14, 2026 06:26 PM 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

భక్తిశ్రద్ధలతో బ్రహ్మోత్సవాలు… పంచామృత అభిషేకం, సహస్రనామ పుష్పార్చన

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో ఉన్న శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయంలో ఆదివారం రోజు శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 5 గంటలకు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం ఉదయం 8 గంటలకు గణపతి పూజ, 8.30 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష పంచామృత అభిషేకం, సహస్రనామ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు ద్వజారోహణం, హోమం నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంటకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షులు నాగిళ్ల రామచంద్రం, ఉపాధ్యక్షులు చింతల ప్రభాకర్ రెడ్డి, ఊదరి శ్యాంసుందర్, ప్రధాన కార్యదర్శి ఊదరి శంకర్, కోశాధికారి ఎలక రాజునాగరాజు (మల్లేష్), సహాయ కార్యదర్శి ఉష్కాగుల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి తోర్పునూరి నరసింహ గౌడ్, ఆరుట్ల లింగస్వామి, సంస్కృతిక కార్యదర్శులు తోర్పునూరి మల్లేష్ గౌడ్, గట్టు పవన్, కార్యవర్గ సభ్యులు నకిరేకంటి శ్రీశైలం, ఉదరి మారయ్య, ఉదరి యాదయ్య, చెవగొని మహేష్, జక్క జక్కర్తి శేఖర్, నల్ల పర్వతాలు, ఉయ్యాల పల్లవి, గంగిరెడ్డి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గౌరవ సలహాదారులు చింతల దామోదర్ రెడ్డి, బత్తుల శ్రీశైలం గౌడ్, మంచికంటి భాస్కర్ గుప్తా, గుజ్జల సురేందర్ రెడ్డి, అన్నెమోని గోవిందరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు బత్తుల విప్లవ గౌడ్, కాసుల వెంకటేష్, బాల్యం వెంకటాచలపతి, నల్ల గణేష్, ఆలయ అర్చకులు సంతోష్ కుమార్ శాస్త్రి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News