Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 21, 2026 06:29 PM

అంగరంగ వైభవంగా రంజాన్ వేడుకలు

అంగరంగ వైభవంగా రంజాన్ వేడుకలు

అంగరంగ వైభవంగా రంజాన్ వేడుకలు
March 21, 2026 04:42 PM 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : CHOUTUPPAL MANDAL
K.RAVI

చౌటుప్పల్‌లో సామూహిక ప్రార్థనలు… ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన చేర్మెన్

ముస్లిం సోదర సోదరీమణుల పవిత్ర పర్వదినం రంజాన్ సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయాన్నే ముస్లిం సోదరులు స్థానిక ఈద్గా వద్దకు చేరుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో అల్లాహ్‌ను ప్రార్థిస్తూ ఉపవాస దీక్షలను ముగించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ… నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి అల్లాహ్‌కు ప్రార్థనలు చేసిన ముస్లింలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పర్వదినం సమాజంలో ఐక్యతను మరింత బలపరుస్తుందని అన్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, కౌన్సిలర్లు కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, బద్రి గాలయ్య, చింతల ఉమామహేశ్వరి సాయిలు, పిల్లలమర్రి మధుసూదన్, ఎండి హన్నుబాయ్, ఏఎంసీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్, బాబా షరీఫ్, ఎండి కరీం, పెద్దగొని రమేష్ గౌడ్, ఎండి ఎజాస్, వహీద్, గణేష్, చింటూ, సంతోష్, శివ, అజయ్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News