Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:54 PM

అంగరంగ వైభవంగా రంజాన్ వేడుకలు

అంగరంగ వైభవంగా రంజాన్ వేడుకలు

అంగరంగ వైభవంగా రంజాన్ వేడుకలు
March 21, 2026 04:42 PM 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో సామూహిక ప్రార్థనలు… ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన చేర్మెన్

ముస్లిం సోదర సోదరీమణుల పవిత్ర పర్వదినం రంజాన్ సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయాన్నే ముస్లిం సోదరులు స్థానిక ఈద్గా వద్దకు చేరుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో అల్లాహ్‌ను ప్రార్థిస్తూ ఉపవాస దీక్షలను ముగించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ… నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి అల్లాహ్‌కు ప్రార్థనలు చేసిన ముస్లింలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పర్వదినం సమాజంలో ఐక్యతను మరింత బలపరుస్తుందని అన్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, కౌన్సిలర్లు కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, బద్రి గాలయ్య, చింతల ఉమామహేశ్వరి సాయిలు, పిల్లలమర్రి మధుసూదన్, ఎండి హన్నుబాయ్, ఏఎంసీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్, బాబా షరీఫ్, ఎండి కరీం, పెద్దగొని రమేష్ గౌడ్, ఎండి ఎజాస్, వహీద్, గణేష్, చింటూ, సంతోష్, శివ, అజయ్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News