Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:10 AM

అంగరంగ వైభవంగా రంజాన్ వేడుకలు

అంగరంగ వైభవంగా రంజాన్ వేడుకలు

అంగరంగ వైభవంగా రంజాన్ వేడుకలు
21-03-2026 130 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో సామూహిక ప్రార్థనలు… ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన చేర్మెన్

ముస్లిం సోదర సోదరీమణుల పవిత్ర పర్వదినం రంజాన్ సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయాన్నే ముస్లిం సోదరులు స్థానిక ఈద్గా వద్దకు చేరుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో అల్లాహ్‌ను ప్రార్థిస్తూ ఉపవాస దీక్షలను ముగించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ… నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి అల్లాహ్‌కు ప్రార్థనలు చేసిన ముస్లింలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పర్వదినం సమాజంలో ఐక్యతను మరింత బలపరుస్తుందని అన్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, కౌన్సిలర్లు కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, బద్రి గాలయ్య, చింతల ఉమామహేశ్వరి సాయిలు, పిల్లలమర్రి మధుసూదన్, ఎండి హన్నుబాయ్, ఏఎంసీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్, బాబా షరీఫ్, ఎండి కరీం, పెద్దగొని రమేష్ గౌడ్, ఎండి ఎజాస్, వహీద్, గణేష్, చింటూ, సంతోష్, శివ, అజయ్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంగరంగ వైభవంగా రంజాన్ వేడుకలు

Article Image

చౌటుప్పల్‌లో సామూహిక ప్రార్థనలు… ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన చేర్మెన్

ముస్లిం సోదర సోదరీమణుల పవిత్ర పర్వదినం రంజాన్ సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయాన్నే ముస్లిం సోదరులు స్థానిక ఈద్గా వద్దకు చేరుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో అల్లాహ్‌ను ప్రార్థిస్తూ ఉపవాస దీక్షలను ముగించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ… నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి అల్లాహ్‌కు ప్రార్థనలు చేసిన ముస్లింలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పర్వదినం సమాజంలో ఐక్యతను మరింత బలపరుస్తుందని అన్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, కౌన్సిలర్లు కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, బద్రి గాలయ్య, చింతల ఉమామహేశ్వరి సాయిలు, పిల్లలమర్రి మధుసూదన్, ఎండి హన్నుబాయ్, ఏఎంసీ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్, బాబా షరీఫ్, ఎండి కరీం, పెద్దగొని రమేష్ గౌడ్, ఎండి ఎజాస్, వహీద్, గణేష్, చింటూ, సంతోష్, శివ, అజయ్, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News