Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:56 AM

అంగన్వాడీ కార్యకర్తలకు అండగా మడకశిర ఎమ్మెల్యే

అంగన్వాడీ కార్యకర్తలకు అండగా మడకశిర ఎమ్మెల్యే

అంగన్వాడీ కార్యకర్తలకు అండగా మడకశిర ఎమ్మెల్యే
March 10, 2026 09:21 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

మడకశిర నియోజకవర్గంలో అంగన్వాడీలకు ఏ సమస్య వచ్చినా అన్నయ్యగా నేను ఉన్నాననే విషయాన్ని మరచిపోవద్దు అని స్థానిక శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు మరియు శ్రీసత్యసాయిజిల్లా టీడీపీ అధ్యక్షులు ఎం.ఎస్.రాజు హామీ ఇచ్చారు. మడకశిరలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉదయం అంగన్వాడీలతో సమావేశాన్ని ఎం.ఎస్.రాజు నిర్వహించారు. అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎం.ఎస్.రాజు అంగన్వాడీలను ఉద్దేశించి మాట్లాడుతూ.

అంగన్వాడీ ల సమస్యలపై కూటమి ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది. అంగన్వాడీలను గత వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా వేధించింది, వారి సమస్యలపై నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలు చనిపోతే వారికి దహన సంస్కారాల కోసం రూ.15,000 అందించేందుకు చర్యలు తీసుకుంటుంది. పదవీ విరమణ చేసిన అనంతరం అంగన్వాడీలకు బెనిఫిట్స్ ఇచ్చేందుకు అవసరమైన మార్గదర్శకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంగన్వాడీల శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. అంగన్వాడీల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు,యువనేత నారా లోకేష్అంగన్వాడీల సమస్యలను రెండు నెలల్లోపు పరిష్కరించేందుకు శ్రమిస్తున్నారు. మీకు నేను అందుబాటులో లేకపోతే.నేను పట్టించుకోవడం లేదు అనుకున్నప్పుడు ధర్నాలు, నిరసనలు చేయండి. కానీ మీకు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానని మరచిపోవద్దు. మీకు ఏ సమస్య ఉన్నా వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు యువమంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని అంగన్వాడీలకు ఎం.ఎస్.రాజు భరోసా ఇచ్చారు. సమావేశం అనంతరం అంగన్వాడీలకు ఎం.ఎస్.రాజు ఆత్మీయ విందు ఏర్పాటు చేసి, స్వయంగా అంగన్వాడీలకు తానే భోజనం వడ్డించారు. వారితో కలిసి కూర్చుని భోజనం చేశారు. తమను ఈ విధంగా పిలిచి, ధైర్యం చెప్పి, భోజనం పెట్టి, తమ సమస్యలన్నీ విన్న ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజుకు అంగన్వాడీలు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News