Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:39 PM

ఆదోనిలో శ్రీ పాండురంగస్వామి దేవస్థానంలో ధార్మిక కార్యక్రమాలు. 19 నుంచి 22 వరకు ప్రవచనాలు, భజనలు

ఆదోనిలో శ్రీ పాండురంగస్వామి దేవస్థానంలో ధార్మిక కార్యక్రమాలు. 19 నుంచి 22 వరకు ప్రవచనాలు, భజనలు

ఆదోనిలో శ్రీ పాండురంగస్వామి దేవస్థానంలో ధార్మిక కార్యక్రమాలు.  19 నుంచి 22 వరకు ప్రవచనాలు, భజనలు
May 18, 2026 06:29 PM 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని, : తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్‌ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలోని వసంత టాకీస్‌ సమీపంలో ఉన్న శ్రీ రుక్మిణి పాండురంగస్వామి దేవస్థానంలో ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్‌ మల్లు వెంకటరెడ్డి తెలిపారు.

ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, ఇందులో భాగంగా ఇస్కాన్‌ ధర్మప్రచారకులు నిత్యతృప్తదాస్‌ ధార్మిక ప్రవచనాలు నిర్వహించనున్నారని చెప్పారు. స్థానిక భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు కూడా ఉంటాయని తెలిపారు.

22వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు గోపూజ, కుంకుమార్చన ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఆలయ కమిటీ ప్రతినిధులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మహేంద్రకర్‌ లక్ష్మణరావు, ఉపాధ్యక్షుడు జె.ఈశ్వరరావు, కార్యదర్శి జవేల్కర్‌ బాబురావు, సంయుక్త కార్యదర్శి జె.వెంకటేశ్వరరావు, కోశాధికారి పతంగి నరసింగరావు, వడే రఘు, సూత్రవే ఆనంద్‌, సరోదే వెంకోబరావు, ఆదోని తితిదే కళ్యాణ మండపం సిబ్బంది చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News