ఆదోనిలో దాడుల సంస్కృతి పెరుగుతోంది ఫ్యాక్షన్ జోన్గా మారే ప్రమాదం ఉందన్న నూర్ అహ్మద్
ఆదోనిలో దాడుల సంస్కృతి పెరుగుతోంది ఫ్యాక్షన్ జోన్గా మారే ప్రమాదం ఉందన్న నూర్ అహ్మద్
Editor Desk
ఆదోని: ఆదోని నియోజకవర్గంలో పెరుగుతున్న తగాదాలు, దాడుల సంస్కృతి ఆందోళన కలిగిస్తోందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆదోని ఫ్యాక్షన్ జోన్గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి వ్యవస్థలపై పూర్తి పట్టు సాధించకపోవడం, కూటమి నాయకులు పార్టీ కార్యకర్తలపై శ్రద్ధ చూపకపోవడం వల్ల గ్రామాల్లో తగాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. వైసీపీ నుంచి బీజేపీలో చేరుతున్న కొందరు నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
కూటమి నేతలు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. బీజేపీలో చేరే వారికి ముందుగా కూటమి పార్టీలతో సమన్వయం పాటించేలా కౌన్సెలింగ్ ఇవ్వాలని కోరారు.
దాడులు, ప్రతిదాడులకు దూరంగా ఉండి ప్రజలు శాంతియుతంగా జీవించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు ఉంటే పోలీసులను, ఉన్నతాధికారులను ఆశ్రయించాలని సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి