Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యాదాద్రిశుడికి నిత్య పూజలు స్వామివారి నిత్య రాబడి రూ.29.97 లక్షలు డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 14, 2026 10:14 PM

ఆదోనిలో దాడుల సంస్కృతి పెరుగుతోంది ఫ్యాక్షన్‌ జోన్‌గా మారే ప్రమాదం ఉందన్న నూర్‌ అహ్మద్‌

ఆదోనిలో దాడుల సంస్కృతి పెరుగుతోంది ఫ్యాక్షన్‌ జోన్‌గా మారే ప్రమాదం ఉందన్న నూర్‌ అహ్మద్‌

ఆదోనిలో దాడుల సంస్కృతి పెరుగుతోంది ఫ్యాక్షన్‌ జోన్‌గా మారే ప్రమాదం ఉందన్న నూర్‌ అహ్మద్‌
May 14, 2026 08:35 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: ఆదోని నియోజకవర్గంలో పెరుగుతున్న తగాదాలు, దాడుల సంస్కృతి ఆందోళన కలిగిస్తోందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆదోని ఫ్యాక్షన్‌ జోన్‌గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారధి వ్యవస్థలపై పూర్తి పట్టు సాధించకపోవడం, కూటమి నాయకులు పార్టీ కార్యకర్తలపై శ్రద్ధ చూపకపోవడం వల్ల గ్రామాల్లో తగాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. వైసీపీ నుంచి బీజేపీలో చేరుతున్న కొందరు నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

కూటమి నేతలు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. బీజేపీలో చేరే వారికి ముందుగా కూటమి పార్టీలతో సమన్వయం పాటించేలా కౌన్సెలింగ్‌ ఇవ్వాలని కోరారు.

దాడులు, ప్రతిదాడులకు దూరంగా ఉండి ప్రజలు శాంతియుతంగా జీవించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు ఉంటే పోలీసులను, ఉన్నతాధికారులను ఆశ్రయించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News