Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:08 AM

ఆదోనిలో దాడుల సంస్కృతి పెరుగుతోంది ఫ్యాక్షన్‌ జోన్‌గా మారే ప్రమాదం ఉందన్న నూర్‌ అహ్మద్‌

ఆదోనిలో దాడుల సంస్కృతి పెరుగుతోంది ఫ్యాక్షన్‌ జోన్‌గా మారే ప్రమాదం ఉందన్న నూర్‌ అహ్మద్‌

ఆదోనిలో దాడుల సంస్కృతి పెరుగుతోంది ఫ్యాక్షన్‌ జోన్‌గా మారే ప్రమాదం ఉందన్న నూర్‌ అహ్మద్‌
14-05-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని: ఆదోని నియోజకవర్గంలో పెరుగుతున్న తగాదాలు, దాడుల సంస్కృతి ఆందోళన కలిగిస్తోందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆదోని ఫ్యాక్షన్‌ జోన్‌గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారధి వ్యవస్థలపై పూర్తి పట్టు సాధించకపోవడం, కూటమి నాయకులు పార్టీ కార్యకర్తలపై శ్రద్ధ చూపకపోవడం వల్ల గ్రామాల్లో తగాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. వైసీపీ నుంచి బీజేపీలో చేరుతున్న కొందరు నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

కూటమి నేతలు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. బీజేపీలో చేరే వారికి ముందుగా కూటమి పార్టీలతో సమన్వయం పాటించేలా కౌన్సెలింగ్‌ ఇవ్వాలని కోరారు.

దాడులు, ప్రతిదాడులకు దూరంగా ఉండి ప్రజలు శాంతియుతంగా జీవించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు ఉంటే పోలీసులను, ఉన్నతాధికారులను ఆశ్రయించాలని సూచించారు.

Sthanikam

ఆదోనిలో దాడుల సంస్కృతి పెరుగుతోంది ఫ్యాక్షన్‌ జోన్‌గా మారే ప్రమాదం ఉందన్న నూర్‌ అహ్మద్‌

Article Image

ఆదోని: ఆదోని నియోజకవర్గంలో పెరుగుతున్న తగాదాలు, దాడుల సంస్కృతి ఆందోళన కలిగిస్తోందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆదోని ఫ్యాక్షన్‌ జోన్‌గా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారధి వ్యవస్థలపై పూర్తి పట్టు సాధించకపోవడం, కూటమి నాయకులు పార్టీ కార్యకర్తలపై శ్రద్ధ చూపకపోవడం వల్ల గ్రామాల్లో తగాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. వైసీపీ నుంచి బీజేపీలో చేరుతున్న కొందరు నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

కూటమి నేతలు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. బీజేపీలో చేరే వారికి ముందుగా కూటమి పార్టీలతో సమన్వయం పాటించేలా కౌన్సెలింగ్‌ ఇవ్వాలని కోరారు.

దాడులు, ప్రతిదాడులకు దూరంగా ఉండి ప్రజలు శాంతియుతంగా జీవించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలు ఉంటే పోలీసులను, ఉన్నతాధికారులను ఆశ్రయించాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News