అందోల్-జోగిపేట మున్సిపాలిటీ లో మంత్రి దామోదర ఎన్నికల ప్రచారం.
అందోల్-జోగిపేట మున్సిపాలిటీ లో మంత్రి దామోదర ఎన్నికల ప్రచారం.
Sandeep journalist
అందోల్ - జోగిపేట మున్సిపాలిటీ లో మంత్రి దామోదర్ రాజనర్సింహ విస్తృత ప్రచారం.
స్థానిక ప్రజలతో వార్డుల వారీగా ముఖాముఖీ భేటీ.
వార్డులలో సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ.
సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని హామీ
అందోల్ - జోగిపేట మున్సిపాలిటీ ని విద్య , వైద్య కేంద్రంగా అభివృద్ధి
ప్రచారం లో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు .
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీ తో గెలిపించాలని ఓటర్ల కు మంత్రి విజ్ఞప్తి
మున్సిపాలిటీ లో ఏ వార్డుకు వెళ్లిన ప్రజల నుంచి మంచి స్పందన ఉంది
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే ఘన విజయం
అందోల్ - జోగిపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టమన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ .
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాదిస్తుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కోన్నారు .
రాష్ట్రవ్యాప్తంగా 75 నుంచి 80% సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వెల్లడించారు .
ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ,వడ్డీ లేని రుణాలు, విద్యా, వైద్య రంగాల్లో పెను మార్పులు, ఉచిత బస్సు, గృహలక్ష్మి . Jntu ఇంజనీరింగ్ కళాశాల, ఏకీకృత పాఠశాల నిర్మాణం , రేషన్ కార్డులు, ఉద్యోగాల నియామకాలు , నర్సింగ్ కాలేజీ , హాస్టల్ ల నిర్మాణం , కేజీబీవీ లు , మోడల్ స్కూల్ , స్కిల్ డవలప్ మెంట్ సెంటర్ , అధునాతన ఆసుపత్రి నిర్మాణం , మహిళ పాలిటెక్నిక్ ఇలా అన్ని రంగాలలోనూ అందోల్ జోగిపేట ను అభివృద్ధి చేస్తున్నామన్నారు .
రాబోయే రోజుల్లో జోగిపేట లో పరిశ్రమల ఏర్పాటు కు కృషి చేసి మహిళలకు ఉపాధి , ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు . రాష్ట్రము లో ఎక్కడ చూసినా కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం కనిపిస్తుందన్నారు . మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధిస్తుందని మంత్రి వెల్లడించారు . మున్సిపాలిటీలలో ఏ వార్డుకు వెళ్లిన ప్రజల నుంచి మంచి స్పందన ఉందని, వారి సమస్యలు, కష్టాలు విని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారి సంక్షేమం కోసం ప్రణాళికలు చేపట్టడం జరుగుతుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు ..అదరికీ ఉచిత వైద్యం ఉండేలా వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. జోగిపేట లోని ప్రాంతీయ ఆసుపత్రిలో మెరుగైన సేవలను అందించేలా కృషి చేస్తున్నామన్నారు . జోగిపేట పట్టణంలో ని 11, 12, 13, 15, 16, 18, 17, 14 వ వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా పాదయాత్రగా వెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ..ప్రచార కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య , శేరి జగమ్మోహన్ రెడ్డి , సురేందర్ గౌడ్ ,AMC చైర్మన్ జగన్ మోహన్ రెడ్డి . కృష్ణారెడ్డి , పార్టీ పరిశీలకులు కైలాష్ కుమార్ లు , పార్టీ ముఖ్య నాయకులు , కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గోన్నారు .

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి