Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:53 PM

ఆధునిక వ్యవసాయంతో ఆదాయం పెంపు – కలెక్టర్ సూచనలు

ఆధునిక వ్యవసాయంతో ఆదాయం పెంపు – కలెక్టర్ సూచనలు

ఆధునిక వ్యవసాయంతో ఆదాయం పెంపు – కలెక్టర్ సూచనలు
March 24, 2026 04:32 PM 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వర్షాధారిత పథకాల ద్వారా రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించి అధిక దిగుబడులు, ఆదాయం సాధించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవెల్లి గ్రామంలో అమలవుతున్న వర్షాధారిత అభివృద్ధి పథకాన్ని మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రైతులకు అందిస్తున్న పరికరాలు, రాయితీల వినియోగాన్ని సమీక్షిస్తూ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రైతు కూర్మ కొమురయ్య కూరగాయల పొలాన్ని సందర్శించి, పథకం కింద అందించిన పరికరాల వినియోగాన్ని పరిశీలించారు. రైతులు పొందుతున్న లాభాలపై కలెక్టర్ నేరుగా వివరాలు తెలుసుకున్నారు.కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక పద్ధతులు అనుసరిస్తే దిగుబడులు పెరిగి ఆదాయం మెరుగుపడుతుందని తెలిపారు. వర్షాధారిత పథకం కింద 115 మంది లబ్ధిదారులకు సుమారు రూ.32.10 లక్షల విలువైన పరికరాలు, రాయితీలు అందించామని చెప్పారు. ఇందులో ప్లాస్టిక్ క్రేట్లు, వర్మీ బెడ్స్, తేనెటీగల పెంపక బాక్సులు వంటి పరికరాలు ఉన్నాయని వివరించారు.రైతులు సమగ్ర వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసుకుని పంటలను సమిష్టిగా విక్రయించాలి, విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సమర్థంగా వినియోగిస్తే రైతులకు మరింత లాభం చేకూరుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News