అధికార పార్టీకి షాక్.. అల్లి నాగలక్ష్మి రెబల్ ఎంట్రీ 42వ వార్డులో
అధికార పార్టీకి షాక్.. అల్లి నాగలక్ష్మి రెబల్ ఎంట్రీ 42వ వార్డులో
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
అధికార పార్టీకి షాక్.. అల్లి నాగలక్ష్మి రెబల్ ఎంట్రీ 42వ వార్డులో
నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి : సీనియర్ జర్నలిస్ట్ డి.డి. దాసు
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 42వ వార్డు డివిజన్లో అధికార పార్టీ కాంగ్రెస్ అధికారిక అభ్యర్థికి భిన్నంగా రెబల్ అభ్యర్థిగా అల్లి నాగలక్ష్మి (W/o అల్లి మల్లికార్జున్) నామినేషన్ దాఖలు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. గొల్లగూడ, క్రాంతినగర్, ఆర్టీసీ కాలనీ ప్రాంతాల నుంచి వేలాది మంది కార్యకర్తలు, స్థానికులు, మహిళలు, యువకులు "అల్లి నాగలక్ష్మి జిందాబాద్" నినాదాలతో భారీ ర్యాలీ నడిపి నామినేషన్ కార్యాలయానికి చేరుకున్నారు.కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్థికి వ్యతిరేకంగా బరిలోకి దిగిన అల్లి నాగలక్ష్మి రెబల్ ఎంట్రీతో 42వ వార్డు రాజకీయాలు పూర్తిగా ట్విస్ట్ తిరిగాయి. ఈ అంతర్గత పోటీతో కాంగ్రెస్ ఓట్ల విభజన ఖాయం కాగా, BRS, BJPకు అనుకూలంగా పరిణామాలు రావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. స్థానిక ప్రజల సమస్యలు, వార్డు అభివృద్ధి, మహిళా సాధికారతపై దృష్టి పెట్టిన నాగలక్ష్మి "పార్టీ అధికారిక అభ్యర్థి కంటే మేమే ప్రజలకు దగ్గరవారు" అని ధీమాతో ప్రకటించారు. నామినేషన్ కార్యాలయం వద్ద ఉత్సాహ గంగా మారిన వాతావరణం 42వ వార్డు రాజకీయాలు మారనున్నాయని సంకేతం చేసింది. స్థానికులు "మా ప్రాంత అభివృద్ధి కోసం అల్లి నాగలక్ష్మి మాత్రమే సరైన ఎంపిక" అని చెబుతున్నారు.48 వార్డులకు 576 చెల్లుబాటైన నామినేషన్ల మధ్య కాంగ్రెస్ (143), BRS (134), BJP (122), AIMIM (17), స్వతంత్రులు (97) పోటీ పడుతున్నారు. 42వ వార్డులో కాంగ్రెస్ అంతర్గత పోటీతో ఓటు సమీకరణం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.స్క్రూటినీ పూర్తి అయింది. ఉపసంహారణ ఫిబ్రవరి 3 వరకు ఉంది. పోలింగ్ ఫిబ్రవరి 11న జరగనుంది. అల్లి నాగలక్ష్మి రెబల్ ఎంట్రీతో 42వ వార్డు ఎన్నికలు నల్గొండ మొత్తం రాజకీయాలపై ప్రభావం చూపవచ్చు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి