Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:18 PM

అధికార పార్టీకి షాక్.. అల్లి నాగలక్ష్మి రెబల్ ఎంట్రీ 42వ వార్డులో

అధికార పార్టీకి షాక్.. అల్లి నాగలక్ష్మి రెబల్ ఎంట్రీ 42వ వార్డులో

అధికార పార్టీకి షాక్.. అల్లి నాగలక్ష్మి రెబల్ ఎంట్రీ 42వ వార్డులో
February 01, 2026 03:04 AM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

అధికార పార్టీకి షాక్.. అల్లి నాగలక్ష్మి రెబల్ ఎంట్రీ 42వ వార్డులో

నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి : సీనియర్ జర్నలిస్ట్ డి.డి. దాసు

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 42వ వార్డు డివిజన్‌లో అధికార పార్టీ కాంగ్రెస్ అధికారిక అభ్యర్థికి భిన్నంగా రెబల్ అభ్యర్థిగా అల్లి నాగలక్ష్మి (W/o అల్లి మల్లికార్జున్) నామినేషన్ దాఖలు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. గొల్లగూడ, క్రాంతినగర్, ఆర్‌టీసీ కాలనీ ప్రాంతాల నుంచి వేలాది మంది కార్యకర్తలు, స్థానికులు, మహిళలు, యువకులు "అల్లి నాగలక్ష్మి జిందాబాద్" నినాదాలతో భారీ ర్యాలీ నడిపి నామినేషన్ కార్యాలయానికి చేరుకున్నారు.కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్థికి వ్యతిరేకంగా బరిలోకి దిగిన అల్లి నాగలక్ష్మి రెబల్ ఎంట్రీతో 42వ వార్డు రాజకీయాలు పూర్తిగా ట్విస్ట్ తిరిగాయి. ఈ అంతర్గత పోటీతో కాంగ్రెస్ ఓట్ల విభజన ఖాయం కాగా, BRS, BJPకు అనుకూలంగా పరిణామాలు రావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. స్థానిక ప్రజల సమస్యలు, వార్డు అభివృద్ధి, మహిళా సాధికారతపై దృష్టి పెట్టిన నాగలక్ష్మి "పార్టీ అధికారిక అభ్యర్థి కంటే మేమే ప్రజలకు దగ్గరవారు" అని ధీమాతో ప్రకటించారు. నామినేషన్ కార్యాలయం వద్ద ఉత్సాహ గంగా మారిన వాతావరణం 42వ వార్డు రాజకీయాలు మారనున్నాయని సంకేతం చేసింది. స్థానికులు "మా ప్రాంత అభివృద్ధి కోసం అల్లి నాగలక్ష్మి మాత్రమే సరైన ఎంపిక" అని చెబుతున్నారు.48 వార్డులకు 576 చెల్లుబాటైన నామినేషన్ల మధ్య కాంగ్రెస్ (143), BRS (134), BJP (122), AIMIM (17), స్వతంత్రులు (97) పోటీ పడుతున్నారు. 42వ వార్డులో కాంగ్రెస్ అంతర్గత పోటీతో ఓటు సమీకరణం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది.స్క్రూటినీ పూర్తి అయింది. ఉపసంహారణ ఫిబ్రవరి 3 వరకు ఉంది. పోలింగ్ ఫిబ్రవరి 11న జరగనుంది. అల్లి నాగలక్ష్మి రెబల్ ఎంట్రీతో 42వ వార్డు ఎన్నికలు నల్గొండ మొత్తం రాజకీయాలపై ప్రభావం చూపవచ్చు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News