అధికార కాంగ్రెస్కే ఓటు.. జహీరాబాద్ అభివృద్ధికి పిలుపు
అధికార కాంగ్రెస్కే ఓటు.. జహీరాబాద్ అభివృద్ధికి పిలుపు
Reporter Sangameshwar Reddy
జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి R.గంగవతి (రాజశేఖర్) గారికి మద్దతుగా హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో DCC కార్యదర్శి, మాజీ ZPTC K.భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 23వ వార్డు అభివృద్ధికి పూర్తిగా నోచుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత కరెంట్, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చిందని తెలిపారు.రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీని బలపరచి 23వ వార్డు అభ్యర్థి గంగవతి (రాజశేఖర్) గారిని గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో సుధాకర్ (సర్పంచ్–చినిగేపల్లి), M.రమేష్ (సర్పంచ్–చిక్కుర్తి), PACS చైర్మన్ సిద్ధి లింగయ్య స్వామి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి