Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:17 AM

అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యామ్నాయంగా రోడ్డుపై గుంతలు పూడ్చిన ఆటో డ్రైవర్లు

అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యామ్నాయంగా రోడ్డుపై గుంతలు పూడ్చిన ఆటో డ్రైవర్లు

అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యామ్నాయంగా రోడ్డుపై గుంతలు పూడ్చిన ఆటో డ్రైవర్లు
06-01-2026 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలం ఎన్నారం గ్రామంలో అమ్మనబోలు రోడ్డుపై ఏర్పడిన ప్రమాదకర గుంతలు ప్రయాణికులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు స్వయంగా ముందుకు వచ్చి గుంతలను మట్టిపోసి తాత్కాలికంగా పూడ్చారు.

ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు తుర్కపల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ, మోకాళ్ల లోతు గుంతల వల్ల ఆటోలు నడపలేని పరిస్థితి ఏర్పడిందని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలకు నష్టం వాటిల్లడంతో పాటు ప్రయాణికుల భద్రతకూ ముప్పు ఏర్పడిందన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో డ్రైవర్లే కలిసి తాత్కాలిక మరమ్మతులు చేయాల్సి వచ్చిందన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి గుంతలను పూడ్చి రోడ్డును శాశ్వతంగా మరమ్మతు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బూడిద ఎల్లయ్య, బొంగు బిక్షపతి, నరసింహ, బొక్కోనిగూడెం నరసింహ, యాదాసు నరసింహ, మంద సంజీ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యామ్నాయంగా రోడ్డుపై గుంతలు పూడ్చిన ఆటో డ్రైవర్లు

Article Image

రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలం ఎన్నారం గ్రామంలో అమ్మనబోలు రోడ్డుపై ఏర్పడిన ప్రమాదకర గుంతలు ప్రయాణికులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు స్వయంగా ముందుకు వచ్చి గుంతలను మట్టిపోసి తాత్కాలికంగా పూడ్చారు.

ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు తుర్కపల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ, మోకాళ్ల లోతు గుంతల వల్ల ఆటోలు నడపలేని పరిస్థితి ఏర్పడిందని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలకు నష్టం వాటిల్లడంతో పాటు ప్రయాణికుల భద్రతకూ ముప్పు ఏర్పడిందన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో డ్రైవర్లే కలిసి తాత్కాలిక మరమ్మతులు చేయాల్సి వచ్చిందన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి గుంతలను పూడ్చి రోడ్డును శాశ్వతంగా మరమ్మతు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బూడిద ఎల్లయ్య, బొంగు బిక్షపతి, నరసింహ, బొక్కోనిగూడెం నరసింహ, యాదాసు నరసింహ, మంద సంజీ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News