Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:12 AM

అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యామ్నాయంగా రోడ్డుపై గుంతలు పూడ్చిన ఆటో డ్రైవర్లు

అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యామ్నాయంగా రోడ్డుపై గుంతలు పూడ్చిన ఆటో డ్రైవర్లు

అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యామ్నాయంగా రోడ్డుపై గుంతలు పూడ్చిన ఆటో డ్రైవర్లు
January 06, 2026 06:31 AM 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలం ఎన్నారం గ్రామంలో అమ్మనబోలు రోడ్డుపై ఏర్పడిన ప్రమాదకర గుంతలు ప్రయాణికులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు స్వయంగా ముందుకు వచ్చి గుంతలను మట్టిపోసి తాత్కాలికంగా పూడ్చారు.

ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు తుర్కపల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ, మోకాళ్ల లోతు గుంతల వల్ల ఆటోలు నడపలేని పరిస్థితి ఏర్పడిందని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలకు నష్టం వాటిల్లడంతో పాటు ప్రయాణికుల భద్రతకూ ముప్పు ఏర్పడిందన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో డ్రైవర్లే కలిసి తాత్కాలిక మరమ్మతులు చేయాల్సి వచ్చిందన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి గుంతలను పూడ్చి రోడ్డును శాశ్వతంగా మరమ్మతు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బూడిద ఎల్లయ్య, బొంగు బిక్షపతి, నరసింహ, బొక్కోనిగూడెం నరసింహ, యాదాసు నరసింహ, మంద సంజీ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News