Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:11 AM

అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యామ్నాయంగా రోడ్డుపై గుంతలు పూడ్చిన ఆటో డ్రైవర్లు

అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యామ్నాయంగా రోడ్డుపై గుంతలు పూడ్చిన ఆటో డ్రైవర్లు

అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యామ్నాయంగా రోడ్డుపై గుంతలు పూడ్చిన ఆటో డ్రైవర్లు
January 06, 2026 06:31 AM 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలం ఎన్నారం గ్రామంలో అమ్మనబోలు రోడ్డుపై ఏర్పడిన ప్రమాదకర గుంతలు ప్రయాణికులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు స్వయంగా ముందుకు వచ్చి గుంతలను మట్టిపోసి తాత్కాలికంగా పూడ్చారు.

ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు తుర్కపల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ, మోకాళ్ల లోతు గుంతల వల్ల ఆటోలు నడపలేని పరిస్థితి ఏర్పడిందని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలకు నష్టం వాటిల్లడంతో పాటు ప్రయాణికుల భద్రతకూ ముప్పు ఏర్పడిందన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో డ్రైవర్లే కలిసి తాత్కాలిక మరమ్మతులు చేయాల్సి వచ్చిందన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి గుంతలను పూడ్చి రోడ్డును శాశ్వతంగా మరమ్మతు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బూడిద ఎల్లయ్య, బొంగు బిక్షపతి, నరసింహ, బొక్కోనిగూడెం నరసింహ, యాదాసు నరసింహ, మంద సంజీ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News