అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యామ్నాయంగా రోడ్డుపై గుంతలు పూడ్చిన ఆటో డ్రైవర్లు
అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యామ్నాయంగా రోడ్డుపై గుంతలు పూడ్చిన ఆటో డ్రైవర్లు
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రతినిధి
రామన్నపేట మండలం ఎన్నారం గ్రామంలో అమ్మనబోలు రోడ్డుపై ఏర్పడిన ప్రమాదకర గుంతలు ప్రయాణికులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు స్వయంగా ముందుకు వచ్చి గుంతలను మట్టిపోసి తాత్కాలికంగా పూడ్చారు.
ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు తుర్కపల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ, మోకాళ్ల లోతు గుంతల వల్ల ఆటోలు నడపలేని పరిస్థితి ఏర్పడిందని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలకు నష్టం వాటిల్లడంతో పాటు ప్రయాణికుల భద్రతకూ ముప్పు ఏర్పడిందన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో డ్రైవర్లే కలిసి తాత్కాలిక మరమ్మతులు చేయాల్సి వచ్చిందన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి గుంతలను పూడ్చి రోడ్డును శాశ్వతంగా మరమ్మతు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బూడిద ఎల్లయ్య, బొంగు బిక్షపతి, నరసింహ, బొక్కోనిగూడెం నరసింహ, యాదాసు నరసింహ, మంద సంజీ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి