PRINT TIME: April 10, 2026 09:21 PM
అధైర్యపడొద్దు… అందరికీ పదవులు
అధైర్యపడొద్దు… అందరికీ పదవులు
December 27, 2025 06:01 PM
109 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
కాంగ్రెస్లో అందరికీ అవకాశం… జనవరి 1 నాటికి జిల్లా కమిటీ పూర్తి
సూర్యాపేట స్థానికం ప్రతినిధి
సూర్యాపేట: కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు తప్పకుండా పదవులు వస్తాయని పీసీసీ పరిశీలకులు బిజ్జి శత్రు రావు, మానాల మోహన్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన డీసీసీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ జనవరి 1 నాటికి జిల్లా కమిటీ పూర్తి చేస్తామన్నారు.
అన్ని మండలాల నుంచి ప్రతినిధ్యంతో డీసీసీ కూర్పు చేస్తామని, మహిళలకు 20 శాతం పదవులు కేటాయిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కమిటీలు లేకుండా కార్యకర్తలతో గులాంగిరి చేయించిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కార్యకర్తల విజయం అని, రాబోయే జెడ్పిటిసి, ఎంపిటిసి, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి