Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:54 AM

ఆదర్శ గ్రామంగా బోగారాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం. తెలంగాణ అవతరణ దినోత్సవ సందేశంలో సర్పంచ్ సాయి కుమార్ గౌడ్

ఆదర్శ గ్రామంగా బోగారాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం. తెలంగాణ అవతరణ దినోత్సవ సందేశంలో సర్పంచ్ సాయి కుమార్ గౌడ్

ఆదర్శ గ్రామంగా బోగారాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం.  తెలంగాణ అవతరణ దినోత్సవ సందేశంలో సర్పంచ్ సాయి కుమార్ గౌడ్
02-06-2026 116 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బోగారం గ్రామ ప్రజలకు సర్పంచ్ కునూర్ సాయి కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. అనేక దశాబ్దాల పోరాటాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన సందేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తన వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తానని తెలిపారు. గ్రామంలో రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని చెప్పారు.

పరిశుభ్రమైన బోగారం లక్ష్యంగా ప్రతి ఇల్లు, ప్రతి వీధిని పచ్చదనంతో నింపేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా అందేలా కృషి చేస్తామని తెలిపారు. యువత, మహిళల స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలందరి సహకారంతో బోగారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన సంకల్పమని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా బంగారు తెలంగాణ నిర్మాణంలో బోగారం గ్రామం కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

Sthanikam

ఆదర్శ గ్రామంగా బోగారాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం. తెలంగాణ అవతరణ దినోత్సవ సందేశంలో సర్పంచ్ సాయి కుమార్ గౌడ్

Article Image

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బోగారం గ్రామ ప్రజలకు సర్పంచ్ కునూర్ సాయి కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. అనేక దశాబ్దాల పోరాటాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన సందేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తన వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తానని తెలిపారు. గ్రామంలో రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని చెప్పారు.

పరిశుభ్రమైన బోగారం లక్ష్యంగా ప్రతి ఇల్లు, ప్రతి వీధిని పచ్చదనంతో నింపేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా అందేలా కృషి చేస్తామని తెలిపారు. యువత, మహిళల స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలందరి సహకారంతో బోగారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన సంకల్పమని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా బంగారు తెలంగాణ నిర్మాణంలో బోగారం గ్రామం కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News