ఆదర్శ గ్రామంగా బోగారాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం. తెలంగాణ అవతరణ దినోత్సవ సందేశంలో సర్పంచ్ సాయి కుమార్ గౌడ్
ఆదర్శ గ్రామంగా బోగారాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యం. తెలంగాణ అవతరణ దినోత్సవ సందేశంలో సర్పంచ్ సాయి కుమార్ గౌడ్
Editor Desk
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బోగారం గ్రామ ప్రజలకు సర్పంచ్ కునూర్ సాయి కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. అనేక దశాబ్దాల పోరాటాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన సందేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి తన వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తానని తెలిపారు. గ్రామంలో రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని చెప్పారు.
పరిశుభ్రమైన బోగారం లక్ష్యంగా ప్రతి ఇల్లు, ప్రతి వీధిని పచ్చదనంతో నింపేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి పారదర్శకంగా అందేలా కృషి చేస్తామని తెలిపారు. యువత, మహిళల స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలందరి సహకారంతో బోగారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన సంకల్పమని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా బంగారు తెలంగాణ నిర్మాణంలో బోగారం గ్రామం కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి