PRINT TIME: May 07, 2026 09:10 PM
ఆడదాకులపల్లిలో రెవెన్యూ సమస్యల పరిష్కార వేదిక
ఆడదాకులపల్లిలో రెవెన్యూ సమస్యల పరిష్కార వేదిక
May 07, 2026 08:16 PM
6 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం ఆడదాకులపల్లి గ్రామంలో రాష్ట్ర మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు “రెవెన్యూ సమస్యల పరిష్కార వేదిక - వన్ విలేజ్ వన్ మంత్ - 4 విజిట్స్” కార్యక్రమం నిర్వహించారు.
గ్రామ సభలో ఎమ్మార్వో అధ్యక్షతన రెవెన్యూ, తాగునీరు, రోడ్ల సమస్యలపై గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మార్వో హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పెనుకొండ మండల కన్వీనర్ దండు ఈశ్వర్ ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో, మండల సర్వేయర్, ఏపీవో, పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి