అడ్డగుడుర్లో ప్రభుత్వ ఐటీఐ–ఏటీసీ శంకుస్థాపన: నైపుణ్యాభివృద్ధికి కొత్త ఊపు
అడ్డగుడుర్లో ప్రభుత్వ ఐటీఐ–ఏటీసీ శంకుస్థాపన: నైపుణ్యాభివృద్ధికి కొత్త ఊపు
Editor Desk
యాదాద్రి స్థానికం ప్రతినిధి
తుంగతుర్తి నియోజకవర్గంలోని అడ్డగుడుర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, గనులు మరియు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ ఈ కార్యక్రమానికి హాజరై శంకుస్థాపన చేశారు. ఆయనతో కలిసి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు పాల్గొన్నారు.
యువతకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ఐటీఐ, ఏటీసీ సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని, నైపుణ్యాభివృద్ధి ద్వారా స్థానికంగా ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఈ శంకుస్థాపనతో అడ్డగుడుర్ ప్రాంతంలో సాంకేతిక విద్యకు కొత్త ఊపొచ్చిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సహా వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి