Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:32 AM

ABN రాధాకృష్ణపై చర్యలు కోరిన ఉషాశ్రీచరణ్

ABN రాధాకృష్ణపై చర్యలు కోరిన ఉషాశ్రీచరణ్

ABN రాధాకృష్ణపై చర్యలు కోరిన ఉషాశ్రీచరణ్
09-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

పెనుకొండ, ఏప్రిల్‌ 9: ABN ఆంధ్రజ్యోతి చానల్‌లో ప్రసారమైన “వీకెండ్ కామెంట్ బై ఆర్‌కే” కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఉషాశ్రీచరణ్ డీఎస్పీని కోరారు. గురువారం పెనుకొండ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఏప్రిల్‌ 4న ప్రసారమైన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అవమానకర, దూషణాత్మక వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. బాధ్యతాయుత జర్నలిజానికి విరుద్ధంగా, ఆధారరహిత వ్యాఖ్యలు ప్రసారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని అన్నారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలను అవమానించేలా అనుచిత పదజాలం ఉపయోగించారని, ముఖ్యంగా మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు. ఇటువంటి ప్రసారాలు సమాజంలో విభేదాలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు.

కాబట్టి, కార్యక్రమానికి బాధ్యులైన నిర్వాహకులు, యాంకర్, ఎడిటర్‌, మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరినట్టు తెలిపారు. అలాగే ఆ దూషణాత్మక కంటెంట్‌ను అన్ని వేదికల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మండల కన్వీనర్లు పాల్గొన్నారు.

Sthanikam

ABN రాధాకృష్ణపై చర్యలు కోరిన ఉషాశ్రీచరణ్

Article Image

పెనుకొండ, ఏప్రిల్‌ 9: ABN ఆంధ్రజ్యోతి చానల్‌లో ప్రసారమైన “వీకెండ్ కామెంట్ బై ఆర్‌కే” కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఉషాశ్రీచరణ్ డీఎస్పీని కోరారు. గురువారం పెనుకొండ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఏప్రిల్‌ 4న ప్రసారమైన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అవమానకర, దూషణాత్మక వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. బాధ్యతాయుత జర్నలిజానికి విరుద్ధంగా, ఆధారరహిత వ్యాఖ్యలు ప్రసారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని అన్నారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలను అవమానించేలా అనుచిత పదజాలం ఉపయోగించారని, ముఖ్యంగా మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు. ఇటువంటి ప్రసారాలు సమాజంలో విభేదాలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు.

కాబట్టి, కార్యక్రమానికి బాధ్యులైన నిర్వాహకులు, యాంకర్, ఎడిటర్‌, మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరినట్టు తెలిపారు. అలాగే ఆ దూషణాత్మక కంటెంట్‌ను అన్ని వేదికల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మండల కన్వీనర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News