Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:38 PM

ABN రాధాకృష్ణపై చర్యలు కోరిన ఉషాశ్రీచరణ్

ABN రాధాకృష్ణపై చర్యలు కోరిన ఉషాశ్రీచరణ్

ABN రాధాకృష్ణపై చర్యలు కోరిన ఉషాశ్రీచరణ్
April 09, 2026 02:26 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

పెనుకొండ, ఏప్రిల్‌ 9: ABN ఆంధ్రజ్యోతి చానల్‌లో ప్రసారమైన “వీకెండ్ కామెంట్ బై ఆర్‌కే” కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఉషాశ్రీచరణ్ డీఎస్పీని కోరారు. గురువారం పెనుకొండ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఏప్రిల్‌ 4న ప్రసారమైన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అవమానకర, దూషణాత్మక వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. బాధ్యతాయుత జర్నలిజానికి విరుద్ధంగా, ఆధారరహిత వ్యాఖ్యలు ప్రసారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని అన్నారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలను అవమానించేలా అనుచిత పదజాలం ఉపయోగించారని, ముఖ్యంగా మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు. ఇటువంటి ప్రసారాలు సమాజంలో విభేదాలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు.

కాబట్టి, కార్యక్రమానికి బాధ్యులైన నిర్వాహకులు, యాంకర్, ఎడిటర్‌, మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరినట్టు తెలిపారు. అలాగే ఆ దూషణాత్మక కంటెంట్‌ను అన్ని వేదికల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మండల కన్వీనర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News