Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రజల సమస్యల పరిష్కారానికి ముందడుగు – ఖేడ్ ఎమ్మెల్యే సమీక్ష ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 03:58 PM

ABN రాధాకృష్ణపై చర్యలు కోరిన ఉషాశ్రీచరణ్

ABN రాధాకృష్ణపై చర్యలు కోరిన ఉషాశ్రీచరణ్

ABN రాధాకృష్ణపై చర్యలు కోరిన ఉషాశ్రీచరణ్
April 09, 2026 02:26 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

పెనుకొండ, ఏప్రిల్‌ 9: ABN ఆంధ్రజ్యోతి చానల్‌లో ప్రసారమైన “వీకెండ్ కామెంట్ బై ఆర్‌కే” కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఉషాశ్రీచరణ్ డీఎస్పీని కోరారు. గురువారం పెనుకొండ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఏప్రిల్‌ 4న ప్రసారమైన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అవమానకర, దూషణాత్మక వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. బాధ్యతాయుత జర్నలిజానికి విరుద్ధంగా, ఆధారరహిత వ్యాఖ్యలు ప్రసారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని అన్నారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలను అవమానించేలా అనుచిత పదజాలం ఉపయోగించారని, ముఖ్యంగా మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు. ఇటువంటి ప్రసారాలు సమాజంలో విభేదాలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు.

కాబట్టి, కార్యక్రమానికి బాధ్యులైన నిర్వాహకులు, యాంకర్, ఎడిటర్‌, మేనేజ్‌మెంట్‌పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరినట్టు తెలిపారు. అలాగే ఆ దూషణాత్మక కంటెంట్‌ను అన్ని వేదికల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మండల కన్వీనర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News