Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ రికార్డులతో మెరిసిన లయన్ గోజు ర్యూ కరాటే అకాడమీ వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 08:05 PM

అభివృద్ధి పథంలో తిరుమలగిరి గ్రామం

అభివృద్ధి పథంలో తిరుమలగిరి గ్రామం

అభివృద్ధి పథంలో తిరుమలగిరి గ్రామం
January 13, 2026 08:36 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉప సర్పంచ్ బోడ స్వప్న సాయిరాం

చిట్యాల స్థానికం ప్రతినిది ప్రశాంత్:

నార్కట్పల్లి మండలం తిరుమలగిరి గ్రామంలో ఏ సమస్య ఎదురైనా పరిష్కరించేందుకు మైనంపాటి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని గ్రామ ఉప సర్పంచ్ బోడ స్వప్న సాయిరాం తెలిపారు.గ్రామంలో గత కొద్ది రోజులుగా రోడ్డుకు ఇరువైపులా పిచ్చి చెట్లు పెరిగి, మట్టి పేరుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఉప సర్పంచ్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించారు. జెసిబి సహాయంతో పిచ్చి మొక్కలు, పేరుకుపోయిన మట్టిని తొలగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో వీధి దీపాల సమస్య, పారిశుద్ధ్య లోపాలు, తాగునీటి ఇబ్బందులు, సీసీ రోడ్ల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా పని చేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు లింగాల కవిత, లింగాల రాజు, బోడ మానస రాజు పాల్గొనగా, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News