అభివృద్ధి పథంలో తిరుమలగిరి గ్రామం
అభివృద్ధి పథంలో తిరుమలగిరి గ్రామం
Editor Desk
ఉప సర్పంచ్ బోడ స్వప్న సాయిరాం
చిట్యాల స్థానికం ప్రతినిది ప్రశాంత్:
నార్కట్పల్లి మండలం తిరుమలగిరి గ్రామంలో ఏ సమస్య ఎదురైనా పరిష్కరించేందుకు మైనంపాటి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని గ్రామ ఉప సర్పంచ్ బోడ స్వప్న సాయిరాం తెలిపారు.గ్రామంలో గత కొద్ది రోజులుగా రోడ్డుకు ఇరువైపులా పిచ్చి చెట్లు పెరిగి, మట్టి పేరుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఉప సర్పంచ్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించారు. జెసిబి సహాయంతో పిచ్చి మొక్కలు, పేరుకుపోయిన మట్టిని తొలగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో వీధి దీపాల సమస్య, పారిశుద్ధ్య లోపాలు, తాగునీటి ఇబ్బందులు, సీసీ రోడ్ల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా పని చేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు లింగాల కవిత, లింగాల రాజు, బోడ మానస రాజు పాల్గొనగా, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి