PRINT TIME: February 24, 2026 12:51 AM
అభివృద్ధి లక్ష్యంగా మూడో వార్డులో బీజేపీ అభ్యర్థి ప్రచారం
అభివృద్ధి లక్ష్యంగా మూడో వార్డులో బీజేపీ అభ్యర్థి ప్రచారం
February 07, 2026 01:32 PM
37 Views
స్థానికం ప్రతినిధి :
Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna
నారాయణఖేడ్ మున్సిపల్ లో శనివారం మాజీ ఎమ్మెల్యే ఎం. విజయపాల్ రెడ్డి ఆశీస్సులతో మూడో వార్డులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మమతా చంద్రశేఖర్ ఉత్సాహభరితంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయ్ కుమార్ సెట్ కార్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వార్డు అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన లక్ష్యంగా అభ్యర్థి ప్రజల్లోకి వెళ్లి తమ అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తున్నారు.ప్రజల నుంచి లభిస్తున్న విశేష స్పందనతో పాటు కార్యకర్తల అండదండలతో బీజేపీ ఎన్నికల ప్రచారం మరింత ఉత్సాహంగా కొనసాగుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి