Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:56 PM

అభివృద్ధే ధ్యేయం.. ప్రజా సేవే లక్ష్యం బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్

అభివృద్ధే ధ్యేయం.. ప్రజా సేవే లక్ష్యం బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్

అభివృద్ధే ధ్యేయం.. ప్రజా సేవే లక్ష్యం బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్
February 07, 2026 01:33 PM 223 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

13 వ వార్డులో గడపగడపకు తిరిగి చేయి గుర్తుకు ఓట్ల అభ్యర్థన

చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డు సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ తోనే సాధ్యమని వార్డు ఇన్చార్టులు వర్కాల కుమార్ గౌడ్, చెవగోని వెంకటేష్ గౌడ్ అన్నారు. శనివారం వార్డులో గడపగడపకు తిరుగుతూ చేతి గుర్తుపై ఓటు వేసి బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ ను గెలిపిస్తే వార్డు సమగ్రాభివృద్ధికి కృషి చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు సహకారం అందుతుందని తెలిపారు. పేద కుటుంబాలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఇప్పటికే సొంతింటి కల నెరవేరేలా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు. అభివృద్ధి కొనసాగాలంటే 13వ వార్డు ప్రజలు కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వస్తున్న బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్ ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కౌన్సిలర్ గా గెలిపిస్తే ఎమ్మెల్యే సహకారంతో అధిక నిధులు తీసుకువచ్చి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్గం నరసింహ, తొర్పునూరి బాబు, వార్డు ఇన్చార్డులు మస్తాన్ బాబు, దేప శ్యాంసుందర్ తో పాటు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News