Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:38 PM

అభయాంజనేయ స్వామి సన్నిధిలో అన్నదానం....

అభయాంజనేయ స్వామి సన్నిధిలో అన్నదానం....

అభయాంజనేయ స్వామి సన్నిధిలో అన్నదానం....
February 24, 2026 06:51 PM 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

అభయాంజనేయ స్వామి కరుణాకటాక్షంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి......

మున్సిపల్ చైర్మన్‌, వైస్ చైర్మన్ లకు ఘన సన్మానం....

కోదాడ పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో 186వ మంగళవారం పురస్కరించుకుని భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలో కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి, కౌన్సిలర్లు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కరుణాకటాక్షంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి మంగళవారం వేలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్న దేవాలయ కమిటీ సభ్యులకు సహకరిస్తున్న దాతలకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు జూకూరి అంజయ్య కమిటీ సభ్యులతో కలిసి మున్సిపల్ చైర్మన్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన కుసుమ బాబు, వైస్ చైర్మన్ మల్లేశ్వరి, స్థానిక కౌన్సిలర్ పద్మావతి నాగేశ్వరరావు, కౌన్సిలర్లు సుబ్బారావు, తూణం కృష్ణ లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జూకూరి సంజీవ్ కుమార్,జూకూరి విజయ ,అన్నదాన నిర్వాహకులు హనుమంతరావు, సెక్రటరీ తిరుపతయ్య, బ్యాటరీ చారి, వీరేపల్లి రామారావు ,చందా నిర్మల, వివిఎన్ఎస్ కుమార్,అనిత, పవిత్ర, పెద్ది.శేషు వి. కృష్ణమూర్తి, పోతుగంటి శ్రీనివాసరావు, ప్రసాద్ , ఆకుల పుల్లారావు, బి ఎల్ ఎన్ రెడ్డి, మోహన్ రావు,విజయరెడ్డి,వెంకటేశ్వర్లు శిరీష ,సైదులు, సత్యనారాయణ, ఉప్పలవంచు వెంకటేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, వెంకటకృష్ణ, విశాల్, మిశ్రా జి. పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు........

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News