Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:23 PM

అభయాంజనేయ స్వామి సన్నిధిలో అన్నదానం....

అభయాంజనేయ స్వామి సన్నిధిలో అన్నదానం....

అభయాంజనేయ స్వామి సన్నిధిలో అన్నదానం....
February 24, 2026 06:51 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

అభయాంజనేయ స్వామి కరుణాకటాక్షంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి......

మున్సిపల్ చైర్మన్‌, వైస్ చైర్మన్ లకు ఘన సన్మానం....

కోదాడ పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ప్రాంగణంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో 186వ మంగళవారం పురస్కరించుకుని భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలో కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి, కౌన్సిలర్లు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి కరుణాకటాక్షంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి మంగళవారం వేలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్న దేవాలయ కమిటీ సభ్యులకు సహకరిస్తున్న దాతలకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షుడు జూకూరి అంజయ్య కమిటీ సభ్యులతో కలిసి మున్సిపల్ చైర్మన్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన కుసుమ బాబు, వైస్ చైర్మన్ మల్లేశ్వరి, స్థానిక కౌన్సిలర్ పద్మావతి నాగేశ్వరరావు, కౌన్సిలర్లు సుబ్బారావు, తూణం కృష్ణ లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జూకూరి సంజీవ్ కుమార్,జూకూరి విజయ ,అన్నదాన నిర్వాహకులు హనుమంతరావు, సెక్రటరీ తిరుపతయ్య, బ్యాటరీ చారి, వీరేపల్లి రామారావు ,చందా నిర్మల, వివిఎన్ఎస్ కుమార్,అనిత, పవిత్ర, పెద్ది.శేషు వి. కృష్ణమూర్తి, పోతుగంటి శ్రీనివాసరావు, ప్రసాద్ , ఆకుల పుల్లారావు, బి ఎల్ ఎన్ రెడ్డి, మోహన్ రావు,విజయరెడ్డి,వెంకటేశ్వర్లు శిరీష ,సైదులు, సత్యనారాయణ, ఉప్పలవంచు వెంకటేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, వెంకటకృష్ణ, విశాల్, మిశ్రా జి. పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు........

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News