Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:00 AM

అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి: తుంబూరు దయాకర్‌రెడ్డి

అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి: తుంబూరు దయాకర్‌రెడ్డి

అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి: తుంబూరు దయాకర్‌రెడ్డి
December 28, 2025 06:52 PM 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి

ఎన్నికలు ముగిశాయి.. ఇక అభివృద్ధే ఏజెండా

ఖమ్మం, స్థానిక ప్రతినిధి జనార్ధన్:

ప్రజలు అప్పగించిన బాధ్యతను విస్మరించకుండా గ్రామాభివృద్ధే పరమావధిగా నూతన ప్రజాప్రతినిధులు పనిచేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్‌ఛార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి సూచించారు.

ఆదివారం ఖమ్మంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కూసుమంచి మండలం నేలపట్ల గ్రామానికి చెందిన నూతన ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఘన విజయం సాధించిన సర్పంచ్ నూకల శోభన్‌బాబు, ఉపసర్పంచ్ తుడుం శ్రీనివాసరావు, వార్డు సభ్యురాలు దుంపల వసంతకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలు ముగిసిన తరువాత ఇకపై గ్రామంలోని ప్రతి గడపకూ ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. మంత్రి పొంగులేటి సహకారంతో నేలపట్ల గ్రామానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి, అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో దండ్యాల లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ పాలకుర్తి వీరబాబు, నాయకులు జాల శోభన్‌బాబు, వార నాగరాజు, పాలపాటి కాంతారావు, తుడుం క్రాంతికుమార్, నూకల పూర్ణచంద్రరావు, తుడుం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

[6:50 PM, 12/28/2025] Konda Mallesham Goud:

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News