Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:54 AM

అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి: తుంబూరు దయాకర్‌రెడ్డి

అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి: తుంబూరు దయాకర్‌రెడ్డి

అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి: తుంబూరు దయాకర్‌రెడ్డి
28-12-2025 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి

ఎన్నికలు ముగిశాయి.. ఇక అభివృద్ధే ఏజెండా

ఖమ్మం, స్థానిక ప్రతినిధి జనార్ధన్:

ప్రజలు అప్పగించిన బాధ్యతను విస్మరించకుండా గ్రామాభివృద్ధే పరమావధిగా నూతన ప్రజాప్రతినిధులు పనిచేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్‌ఛార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి సూచించారు.

ఆదివారం ఖమ్మంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కూసుమంచి మండలం నేలపట్ల గ్రామానికి చెందిన నూతన ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఘన విజయం సాధించిన సర్పంచ్ నూకల శోభన్‌బాబు, ఉపసర్పంచ్ తుడుం శ్రీనివాసరావు, వార్డు సభ్యురాలు దుంపల వసంతకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలు ముగిసిన తరువాత ఇకపై గ్రామంలోని ప్రతి గడపకూ ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. మంత్రి పొంగులేటి సహకారంతో నేలపట్ల గ్రామానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి, అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో దండ్యాల లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ పాలకుర్తి వీరబాబు, నాయకులు జాల శోభన్‌బాబు, వార నాగరాజు, పాలపాటి కాంతారావు, తుడుం క్రాంతికుమార్, నూకల పూర్ణచంద్రరావు, తుడుం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

[6:50 PM, 12/28/2025] Konda Mallesham Goud:

Sthanikam

అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి: తుంబూరు దయాకర్‌రెడ్డి

Article Image

గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి

ఎన్నికలు ముగిశాయి.. ఇక అభివృద్ధే ఏజెండా

ఖమ్మం, స్థానిక ప్రతినిధి జనార్ధన్:

ప్రజలు అప్పగించిన బాధ్యతను విస్మరించకుండా గ్రామాభివృద్ధే పరమావధిగా నూతన ప్రజాప్రతినిధులు పనిచేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్‌ఛార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి సూచించారు.

ఆదివారం ఖమ్మంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కూసుమంచి మండలం నేలపట్ల గ్రామానికి చెందిన నూతన ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఘన విజయం సాధించిన సర్పంచ్ నూకల శోభన్‌బాబు, ఉపసర్పంచ్ తుడుం శ్రీనివాసరావు, వార్డు సభ్యురాలు దుంపల వసంతకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలు ముగిసిన తరువాత ఇకపై గ్రామంలోని ప్రతి గడపకూ ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. మంత్రి పొంగులేటి సహకారంతో నేలపట్ల గ్రామానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి, అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో దండ్యాల లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ పాలకుర్తి వీరబాబు, నాయకులు జాల శోభన్‌బాబు, వార నాగరాజు, పాలపాటి కాంతారావు, తుడుం క్రాంతికుమార్, నూకల పూర్ణచంద్రరావు, తుడుం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

[6:50 PM, 12/28/2025] Konda Mallesham Goud:

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News