Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:51 PM

అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి: తుంబూరు దయాకర్‌రెడ్డి

అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి: తుంబూరు దయాకర్‌రెడ్డి

అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి: తుంబూరు దయాకర్‌రెడ్డి
December 28, 2025 06:52 PM 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి

ఎన్నికలు ముగిశాయి.. ఇక అభివృద్ధే ఏజెండా

ఖమ్మం, స్థానిక ప్రతినిధి జనార్ధన్:

ప్రజలు అప్పగించిన బాధ్యతను విస్మరించకుండా గ్రామాభివృద్ధే పరమావధిగా నూతన ప్రజాప్రతినిధులు పనిచేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్‌ఛార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి సూచించారు.

ఆదివారం ఖమ్మంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కూసుమంచి మండలం నేలపట్ల గ్రామానికి చెందిన నూతన ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఘన విజయం సాధించిన సర్పంచ్ నూకల శోభన్‌బాబు, ఉపసర్పంచ్ తుడుం శ్రీనివాసరావు, వార్డు సభ్యురాలు దుంపల వసంతకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలు ముగిసిన తరువాత ఇకపై గ్రామంలోని ప్రతి గడపకూ ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. మంత్రి పొంగులేటి సహకారంతో నేలపట్ల గ్రామానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి, అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో దండ్యాల లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ పాలకుర్తి వీరబాబు, నాయకులు జాల శోభన్‌బాబు, వార నాగరాజు, పాలపాటి కాంతారావు, తుడుం క్రాంతికుమార్, నూకల పూర్ణచంద్రరావు, తుడుం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

[6:50 PM, 12/28/2025] Konda Mallesham Goud:

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News