Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:36 PM

అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి: తుంబూరు దయాకర్‌రెడ్డి

అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి: తుంబూరు దయాకర్‌రెడ్డి

అభివృద్ధి లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి: తుంబూరు దయాకర్‌రెడ్డి
December 28, 2025 06:52 PM 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలి

ఎన్నికలు ముగిశాయి.. ఇక అభివృద్ధే ఏజెండా

ఖమ్మం, స్థానిక ప్రతినిధి జనార్ధన్:

ప్రజలు అప్పగించిన బాధ్యతను విస్మరించకుండా గ్రామాభివృద్ధే పరమావధిగా నూతన ప్రజాప్రతినిధులు పనిచేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్‌ఛార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి సూచించారు.

ఆదివారం ఖమ్మంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో కూసుమంచి మండలం నేలపట్ల గ్రామానికి చెందిన నూతన ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఘన విజయం సాధించిన సర్పంచ్ నూకల శోభన్‌బాబు, ఉపసర్పంచ్ తుడుం శ్రీనివాసరావు, వార్డు సభ్యురాలు దుంపల వసంతకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలు ముగిసిన తరువాత ఇకపై గ్రామంలోని ప్రతి గడపకూ ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. మంత్రి పొంగులేటి సహకారంతో నేలపట్ల గ్రామానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి, అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో దండ్యాల లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ పాలకుర్తి వీరబాబు, నాయకులు జాల శోభన్‌బాబు, వార నాగరాజు, పాలపాటి కాంతారావు, తుడుం క్రాంతికుమార్, నూకల పూర్ణచంద్రరావు, తుడుం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

[6:50 PM, 12/28/2025] Konda Mallesham Goud:

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News