Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:32 AM

అభివృద్ధి ప్రణాళిక కరపత్రం ఆవిష్కరణ

అభివృద్ధి ప్రణాళిక కరపత్రం ఆవిష్కరణ

అభివృద్ధి ప్రణాళిక కరపత్రం ఆవిష్కరణ
09-12-2025 155 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సర్పంచ్‌ పీఠం కోసం CPI(M) అభ్యర్థి బడుగు అనిత రమేష్

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

సిరిపురం గ్రామ సమస్యలపై పూర్తి అవగాహనతో, ప్రజల్లో నిత్యం కలిసిమెలిసి సమస్యలు పరిష్కరించే నాయకత్వానికే ప్రజలు అవకాశమివ్వాలని CPI(M) సర్పంచ్‌ అభ్యర్థి బడుగు అనిత రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం సిరిపురం గ్రామంలోని CPI(M) పార్టీ కార్యాలయ ఆవరణలో వార్డుల అభ్యర్థులతో కలిసి అభివృద్ధి ప్రణాళిక కరపత్రాన్ని ఆమె ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా మాట్లాడిన ఆమె…

“ఓటు బ్రహ్మాస్త్రం… దాన్ని మద్యం, డబ్బు వంటి ప్రలోభాలకు అమ్మకండి. అవినీతి లేని నీతివంతమైన పాలన అందించగలనన్న నమ్మకంతో ఆశీర్వదించి సర్పంచ్‌గా గెలిపించండి” అని ప్రజలను కోరారు. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యల్ని వెంటనే పరిష్కరించే నాయకత్వాన్ని ఎంచుకోవాలని సూచించారు.“సర్పంచ్‌గా గెలిపిస్తే తొలి రోజే అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి, గ్రామ సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తాం” అని హామీ ఇచ్చారు.


సర్పంచ్‌గా గెలిస్తే… అనిత రమేష్ హామీలు



అఖిలపక్ష కమిటీ ఏర్పాటు – అన్ని పార్టీల నేతలతో కలిసి గ్రామ సమస్యల పరిష్కారం.

సిరిపురం–వెల్మినేడు–తుమ్మలగూడెం–పెద్దకాపర్తి వరకు బీటీ రోడ్డు నిర్మాణం.

గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కల్పన, ముఖ్యంగా బజారు ప్రాంతంలో నిర్మాణాలు.

విద్యకు ప్రాధాన్యం – విద్యార్థుల సంఖ్య పెంపు, 100% ఫలితాల దిశగా చర్యలు.

పిల్లాయిపల్లి కాల్వ–పీడ‌ర్ చానల్ ద్వారా దార్లకుంటకు నీరు తరలింపు.

దాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఎండబెట్టేందుకు సీసీ కల్లు నిర్మాణం.

20 లీటర్ల ఫిల్టర్ నీటిని కేవలం రూ. 2కు అందుబాటులోకి తెస్తాం.

కోతులు, కుక్కల బెడద నివారణ కోసం ప్రత్యేక చర్యలు.

బోటిమీది (వడ్డెర) గూడెంకు సాగర్ పైప్‌లైన్, వాటర్ ట్యాంకు ఏర్పాటు.

కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో వార్డు అభ్యర్థులు జెల్ల సూర్యకళ శ్రీనాథం, బల్గురి అంజయ్య, పబ్బు వెంకటేశం గౌడ్, పవడాల సతీష్, భారత జయమ్మ మృత్యుంజయ, మోటి స్వామి, వర్గాల భవాని నాగరాజు, కంకాల పద్మ శేఖర్, ఎస్కే బిస్మిల్లా బేగం మజీద్, గాదె నరసింహ, భాషబోయిన రవి, సంగిశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.




Sthanikam

అభివృద్ధి ప్రణాళిక కరపత్రం ఆవిష్కరణ

Article Image

సర్పంచ్‌ పీఠం కోసం CPI(M) అభ్యర్థి బడుగు అనిత రమేష్

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

సిరిపురం గ్రామ సమస్యలపై పూర్తి అవగాహనతో, ప్రజల్లో నిత్యం కలిసిమెలిసి సమస్యలు పరిష్కరించే నాయకత్వానికే ప్రజలు అవకాశమివ్వాలని CPI(M) సర్పంచ్‌ అభ్యర్థి బడుగు అనిత రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం సిరిపురం గ్రామంలోని CPI(M) పార్టీ కార్యాలయ ఆవరణలో వార్డుల అభ్యర్థులతో కలిసి అభివృద్ధి ప్రణాళిక కరపత్రాన్ని ఆమె ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా మాట్లాడిన ఆమె…

“ఓటు బ్రహ్మాస్త్రం… దాన్ని మద్యం, డబ్బు వంటి ప్రలోభాలకు అమ్మకండి. అవినీతి లేని నీతివంతమైన పాలన అందించగలనన్న నమ్మకంతో ఆశీర్వదించి సర్పంచ్‌గా గెలిపించండి” అని ప్రజలను కోరారు. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యల్ని వెంటనే పరిష్కరించే నాయకత్వాన్ని ఎంచుకోవాలని సూచించారు.“సర్పంచ్‌గా గెలిపిస్తే తొలి రోజే అన్ని పార్టీల నాయకులతో అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేసి, గ్రామ సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తాం” అని హామీ ఇచ్చారు.


సర్పంచ్‌గా గెలిస్తే… అనిత రమేష్ హామీలు



అఖిలపక్ష కమిటీ ఏర్పాటు – అన్ని పార్టీల నేతలతో కలిసి గ్రామ సమస్యల పరిష్కారం.

సిరిపురం–వెల్మినేడు–తుమ్మలగూడెం–పెద్దకాపర్తి వరకు బీటీ రోడ్డు నిర్మాణం.

గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కల్పన, ముఖ్యంగా బజారు ప్రాంతంలో నిర్మాణాలు.

విద్యకు ప్రాధాన్యం – విద్యార్థుల సంఖ్య పెంపు, 100% ఫలితాల దిశగా చర్యలు.

పిల్లాయిపల్లి కాల్వ–పీడ‌ర్ చానల్ ద్వారా దార్లకుంటకు నీరు తరలింపు.

దాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఎండబెట్టేందుకు సీసీ కల్లు నిర్మాణం.

20 లీటర్ల ఫిల్టర్ నీటిని కేవలం రూ. 2కు అందుబాటులోకి తెస్తాం.

కోతులు, కుక్కల బెడద నివారణ కోసం ప్రత్యేక చర్యలు.

బోటిమీది (వడ్డెర) గూడెంకు సాగర్ పైప్‌లైన్, వాటర్ ట్యాంకు ఏర్పాటు.

కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో వార్డు అభ్యర్థులు జెల్ల సూర్యకళ శ్రీనాథం, బల్గురి అంజయ్య, పబ్బు వెంకటేశం గౌడ్, పవడాల సతీష్, భారత జయమ్మ మృత్యుంజయ, మోటి స్వామి, వర్గాల భవాని నాగరాజు, కంకాల పద్మ శేఖర్, ఎస్కే బిస్మిల్లా బేగం మజీద్, గాదె నరసింహ, భాషబోయిన రవి, సంగిశెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.




మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News