Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:08 AM

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 135వ జయంతి వేడుకలు

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 135వ జయంతి వేడుకలు

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 135వ జయంతి వేడుకలు
14-04-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

40 మందితో మెగా రక్తదాన శిబిరం ప్రారంభం

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వలిగొండ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్యలు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని చైర్మన్ ప్రారంభించగా, సుమారు 40 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. అంబేద్కర్ కేవలం దళితులకే కాకుండా, సమాజంలోని అన్ని పీడిత వర్గాలకు న్యాయం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన గొప్ప సామాజిక సంస్కర్త, న్యాయవేత్త, ఆర్థికవేత్తగా దేశానికి దిశానిర్దేశం చేశారని అన్నారు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపన నుంచి, రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌గా ఆయన చేసిన కృషి అనన్యసామాన్యమనికొనియాడారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బోదుల లింగస్వామి, ప్రధాన కార్యదర్శి ఆరుట్ల శేఖర్, మాజీ కౌన్సిలర్ కొరగొని లింగస్వామి, సీనియర్ నాయకులు బోదుల నర్సింహా, ఆరుట్ల యాదయ్య, ఉదరి యాదయ్య, బోయ రామచంద్రం, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి, యువజన సంఘం సభ్యులు నరేష్, శంకర్, స్వామి, శ్యామ్, గణేష్, రాజు, సాయి జీవన్, విగ్నేష్, రాకేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 135వ జయంతి వేడుకలు

Article Image

40 మందితో మెగా రక్తదాన శిబిరం ప్రారంభం

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వలిగొండ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్యలు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని చైర్మన్ ప్రారంభించగా, సుమారు 40 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. అంబేద్కర్ కేవలం దళితులకే కాకుండా, సమాజంలోని అన్ని పీడిత వర్గాలకు న్యాయం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన గొప్ప సామాజిక సంస్కర్త, న్యాయవేత్త, ఆర్థికవేత్తగా దేశానికి దిశానిర్దేశం చేశారని అన్నారు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపన నుంచి, రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌గా ఆయన చేసిన కృషి అనన్యసామాన్యమనికొనియాడారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బోదుల లింగస్వామి, ప్రధాన కార్యదర్శి ఆరుట్ల శేఖర్, మాజీ కౌన్సిలర్ కొరగొని లింగస్వామి, సీనియర్ నాయకులు బోదుల నర్సింహా, ఆరుట్ల యాదయ్య, ఉదరి యాదయ్య, బోయ రామచంద్రం, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి, యువజన సంఘం సభ్యులు నరేష్, శంకర్, స్వామి, శ్యామ్, గణేష్, రాజు, సాయి జీవన్, విగ్నేష్, రాకేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News