అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో బషీరుద్దీన్ స్మారక ఉపన్యాసం
అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో బషీరుద్దీన్ స్మారక ఉపన్యాసం
స్థానికం బృందం
బషీరుద్దీన్ జయంతి సందర్భంగా అంబేద్కర్ వర్సిటీలో ప్రత్యేక కార్యక్రమం
పాత్రికేయ ప్రపంచంలో మహిళల పాత్రపై చర్చ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో స్మారకోపన్యాసం నిర్వహణ
జర్నలిజంపై మహిళల ప్రభావం
హైదరాబాద్
డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్. బషీరుద్దీన్ తొంభైవ జయంతిని పురస్కరించుకుని విశ్వవిద్యాలయంలో స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా “పాత్రికేయ రంగంపై మహిళల ప్రభావం” అనే అంశంపై స్మారకోపన్యాసం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం పాత్రికేయ శాస్త్ర విభాగం రిటైర్డ్ అధ్యాపకురాలు ప్రొఫెసర్ పద్మజా షా ముఖ్య అతిథిగా హాజరై ఉపన్యాసం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
పాత్రికేయ రంగంలో మహిళల ప్రస్థానం, వారి ఆలోచనా దృక్పథం, సమాజంపై చూపుతున్న ప్రభావంపై ఈ ఉపన్యాసం దృష్టి సారించనుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పాత్రికేయులు, జర్నలిజం విభాగ విద్యార్థులు, పరిశోధకులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని విశ్వవిద్యాలయ అధికారులు పిలుపునిచ్చారు.
ప్రొఫెసర్ ఎస్. బషీరుద్దీన్ విద్యా, పాత్రికేయ రంగాలకు అందించిన సేవలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ స్మారక కార్యక్రమం ఆలోచనాత్మకంగా సాగనుందని వారు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి