Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:03 PM

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో బషీరుద్దీన్ స్మారక ఉపన్యాసం

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో బషీరుద్దీన్ స్మారక ఉపన్యాసం

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో బషీరుద్దీన్ స్మారక ఉపన్యాసం
February 09, 2026 08:26 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బషీరుద్దీన్ జయంతి సందర్భంగా అంబేద్కర్ వర్సిటీలో ప్రత్యేక కార్యక్రమం

పాత్రికేయ ప్రపంచంలో మహిళల పాత్రపై చర్చ

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో స్మారకోపన్యాసం నిర్వహణ

జర్నలిజంపై మహిళల ప్రభావం

హైదరాబాద్

డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్. బషీరుద్దీన్ తొంభైవ జయంతిని పురస్కరించుకుని విశ్వవిద్యాలయంలో స్మారక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా “పాత్రికేయ రంగంపై మహిళల ప్రభావం” అనే అంశంపై స్మారకోపన్యాసం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం పాత్రికేయ శాస్త్ర విభాగం రిటైర్డ్ అధ్యాపకురాలు ప్రొఫెసర్ పద్మజా షా ముఖ్య అతిథిగా హాజరై ఉపన్యాసం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

పాత్రికేయ రంగంలో మహిళల ప్రస్థానం, వారి ఆలోచనా దృక్పథం, సమాజంపై చూపుతున్న ప్రభావంపై ఈ ఉపన్యాసం దృష్టి సారించనుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పాత్రికేయులు, జర్నలిజం విభాగ విద్యార్థులు, పరిశోధకులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని విశ్వవిద్యాలయ అధికారులు పిలుపునిచ్చారు.

ప్రొఫెసర్ ఎస్. బషీరుద్దీన్ విద్యా, పాత్రికేయ రంగాలకు అందించిన సేవలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ స్మారక కార్యక్రమం ఆలోచనాత్మకంగా సాగనుందని వారు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News