Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:09 PM

అంబేద్కర్ జయంతి సందర్భంగా కరపత్రాల విడుదల – జై భీమ్ ర్యాలీకి పిలుపు

అంబేద్కర్ జయంతి సందర్భంగా కరపత్రాల విడుదల – జై భీమ్ ర్యాలీకి పిలుపు

అంబేద్కర్ జయంతి సందర్భంగా కరపత్రాల విడుదల – జై భీమ్ ర్యాలీకి పిలుపు
April 02, 2026 07:59 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, రొద్దం మండలంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలహారం వేసి, బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమం బహుజన చైతన్య వేదిక గౌరవ అధ్యక్షులు రొడ్డం బాబు ప్రసాద్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా సామాజికంగా కుల వివక్షకు గురైన అస్పృశ్యులకు తమ పోరాటాల ద్వారా చైతన్యం కలిగించి, వారికి సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులు సాధించిపెట్టిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని కొనియాడారు.

రాబోయే ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా పెనుకొండలో నిర్వహించే “జై భీమ్ ర్యాలీ” మరియు జూనియర్ కాలేజీ మైదానంలో జరిగే జయంతి సభలో రొద్దం మండలంలోని ప్రతి గ్రామం నుండి అంబేద్కర్ అభిమానులు, బహుజన చైతన్య వేదిక సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ఘన నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేట్ శివరామకృష్ణ, రాయలసీమ ఉపాధ్యక్షులు ఈశ్వర్, గౌరవ అధ్యక్షులు మునుమడుగు నరసింహులు, జిల్లా గౌరవాధ్యక్షులు రంగేపల్లి కదిరప్ప, నాగేపల్లి రామకృష్ణ, గౌరాజ్‌పల్లి సురేష్, మారుతి, దొడగట్ట గోపాలు, కంచి సముద్రం గోవిందు, బుచర్ల నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ సమానత్వ సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News