అంబేద్కర్ జయంతి సందర్భంగా కరపత్రాల విడుదల – జై భీమ్ ర్యాలీకి పిలుపు
అంబేద్కర్ జయంతి సందర్భంగా కరపత్రాల విడుదల – జై భీమ్ ర్యాలీకి పిలుపు
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, రొద్దం మండలంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలహారం వేసి, బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమం బహుజన చైతన్య వేదిక గౌరవ అధ్యక్షులు రొడ్డం బాబు ప్రసాద్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా సామాజికంగా కుల వివక్షకు గురైన అస్పృశ్యులకు తమ పోరాటాల ద్వారా చైతన్యం కలిగించి, వారికి సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులు సాధించిపెట్టిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని కొనియాడారు.
రాబోయే ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా పెనుకొండలో నిర్వహించే “జై భీమ్ ర్యాలీ” మరియు జూనియర్ కాలేజీ మైదానంలో జరిగే జయంతి సభలో రొద్దం మండలంలోని ప్రతి గ్రామం నుండి అంబేద్కర్ అభిమానులు, బహుజన చైతన్య వేదిక సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ఘన నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేట్ శివరామకృష్ణ, రాయలసీమ ఉపాధ్యక్షులు ఈశ్వర్, గౌరవ అధ్యక్షులు మునుమడుగు నరసింహులు, జిల్లా గౌరవాధ్యక్షులు రంగేపల్లి కదిరప్ప, నాగేపల్లి రామకృష్ణ, గౌరాజ్పల్లి సురేష్, మారుతి, దొడగట్ట గోపాలు, కంచి సముద్రం గోవిందు, బుచర్ల నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ సమానత్వ సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి