Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీవాణి విద్యాలయ వార్షికోత్సవం. ఘనంగా విద్యార్థుల ప్రతిభకు వేదికగా వేడుకలు AAP యువ ముఖానికి ‘రాజ్యసభ ఎగ్జిట్’… అంతర్గత వ్యూహాల్లో భారీ మార్పులా? “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 02, 2026 09:45 PM

అంబేద్కర్ జయంతి సందర్భంగా కరపత్రాల విడుదల – జై భీమ్ ర్యాలీకి పిలుపు

అంబేద్కర్ జయంతి సందర్భంగా కరపత్రాల విడుదల – జై భీమ్ ర్యాలీకి పిలుపు

అంబేద్కర్ జయంతి సందర్భంగా కరపత్రాల విడుదల – జై భీమ్ ర్యాలీకి పిలుపు
April 02, 2026 07:59 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, రొద్దం మండలంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలహారం వేసి, బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమం బహుజన చైతన్య వేదిక గౌరవ అధ్యక్షులు రొడ్డం బాబు ప్రసాద్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా సామాజికంగా కుల వివక్షకు గురైన అస్పృశ్యులకు తమ పోరాటాల ద్వారా చైతన్యం కలిగించి, వారికి సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులు సాధించిపెట్టిన మహనీయుడు భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని కొనియాడారు.

రాబోయే ఏప్రిల్ 14న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా పెనుకొండలో నిర్వహించే “జై భీమ్ ర్యాలీ” మరియు జూనియర్ కాలేజీ మైదానంలో జరిగే జయంతి సభలో రొద్దం మండలంలోని ప్రతి గ్రామం నుండి అంబేద్కర్ అభిమానులు, బహుజన చైతన్య వేదిక సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ఘన నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, హైకోర్టు అడ్వకేట్ శివరామకృష్ణ, రాయలసీమ ఉపాధ్యక్షులు ఈశ్వర్, గౌరవ అధ్యక్షులు మునుమడుగు నరసింహులు, జిల్లా గౌరవాధ్యక్షులు రంగేపల్లి కదిరప్ప, నాగేపల్లి రామకృష్ణ, గౌరాజ్‌పల్లి సురేష్, మారుతి, దొడగట్ట గోపాలు, కంచి సముద్రం గోవిందు, బుచర్ల నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ సమానత్వ సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News