అంబేద్కర్ జయంతి సభ విజయవంతం చేయాలని పిలుపు
అంబేద్కర్ జయంతి సభ విజయవంతం చేయాలని పిలుపు
Krishna
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న కరీంనగర్ మహాత్మ జ్యోతిరావు పూలే మైదానంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో విస్తరించడం, సామాజిక న్యాయం మరియు సమానత్వాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ సభను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సభకు సంబంధించిన గోడ పోస్టర్ను నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షుడు అనుముల తుకారం ఆవిష్కరించగా, జిల్లా అధ్యక్షుడు పిప్పడుపల్లి మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బోర్గి భీమన్న, సీనియర్ నాయకుడు మలిగిదొడ్డి పండరి పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే భీమసేన కాశయ్య, యేసయ్య తదితర నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను విస్తరించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి