Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:41 PM

ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటలుగా అగరు వుడ్, వక్క, కోకో, మునగ, మల్బరీ

ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటలుగా అగరు వుడ్, వక్క, కోకో, మునగ, మల్బరీ

ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటలుగా అగరు వుడ్, వక్క, కోకో, మునగ, మల్బరీ
December 30, 2025 07:14 PM 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆయిల్ పామ్ & ఉద్యాన పంటల సాగు లాభదాయకం పంట మార్పిడి తో అధిక ఆదాయం

జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న కొత్త పంటల విస్తీర్ణం

మహబూబాబాద్, స్థానిక ప్రతినిధి బాలు ఆయిల్ పామ్ & ఉద్యాన పంటల సాగు లాభదాయకం పంట మార్పిడి తో అధిక ఆదాయం వస్తుందని జిల్లా ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు, మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో కురవి, సీరోల్, డోర్నకల్, నెల్లికుదురు, మహబూబాబాద్ తదితర మండలాల్లో రైతులు ఉల్లి సాగును చేపట్టి ఎకరానికి యాభై వేలకు పైగా ఆదాయం పొందుతున్నారని ముఖ్యంగా రైతులు నారు మొక్కలు పెంచి, 4 నుండి 6 వారాల నారును పలు జిల్లాలలో మార్కెట్లలో స్థానిక సంతలలో అమ్మి, మంచి లాభాలు పొందుతున్నారన్నారు. అదే విధంగా రైతాంగం మార్కెట్ డిమాండ్ ఉన్న ఉల్లి, వెల్లుల్లి, ధనియాలు, పుదీన, మునగ, మల్బరీ, అలాగే నూతన పంటలైన గాక్, అవకాడో, డ్రాగన్ ఫ్రూట్, స్థానిక పంటలు అయిన నిమ్మ, పనస, నేరేడు, సీతాఫలం, బోడ కాకర, దొండ, పొట్ల, కనకాంబరం, మల్లె, చామంతి, కాకినాడ గులాబీ, స్ప్రే రోసెస్, అన్ని రకాల ఆకు కూరలు మరియు మార్కెట్ డిమాండ్ ఉన్న పలు పంటలు పండించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపినారు. రైతులు ఆయిల్ పామ్, పండ్ల తోటలు సాగు చేస్తూ, అంతర పంటలుగా అగరు వుడ్, వక్క, కోకో, మునగ, మల్బరీ, కూరగాయలు తదితర పంటలు సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని, నిత్యం రోగనిరోధక శక్తికి, ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలు అందించే పండ్ల తోటలు అయిన మామిడి, జామ, నిమ్మ, అరటి, బొప్పాయి, సీతాఫలం, పనస, నేరేడు, అవకాడో, ఫ్యాషన్ ఫ్రూట్, గాక్, కూరగాయలు, ఆకు కూరలు, మునగ, వెదురు మొదలైనవి సాగు చేయాలని తద్వారా ఎకరానికి లక్ష రూపాయలు నికర ఆదాయం పొందాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెరట్లో, ఆయిల్ పామ్, పండ్ల తోటలలో అంతర పంటలుగా, డాబాల మీద, ఇంటి ముంగిట రోజువారి కూరగాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, నూతన రకాల సాగు, ప్రో ట్రే లో నారు పెంపకం, ఎత్తు మడులు, మల్చింగ్, బిందు సేద్యం, ఫర్టిగేషన్, వేప పిండి, ఆముదం పిండి వాడకం, వేప నూనె పిచికారి చేయటం, పసుపు రంగు అట్టల వాడకం, సిఫారసు చేసిన ఎరువులు వాడటం, పందిరిపై కూరగాయల సాగు, ట్రెల్లిస్ మెథడ్ లో టమాటా సాగు మొదలైన పద్ధతులు పాటించాలని అన్నారు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News