Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:51 PM

ఆత్మకూర్ నుండి మోత్కూర్ వరకు రోడ్డు నిర్మాణాన్నివెంటనే పూర్తి చేయాలి (CPM రైతు సంఘాలు)

ఆత్మకూర్ నుండి మోత్కూర్ వరకు రోడ్డు నిర్మాణాన్నివెంటనే పూర్తి చేయాలి (CPM రైతు సంఘాలు)

ఆత్మకూర్ నుండి మోత్కూర్ వరకు రోడ్డు నిర్మాణాన్నివెంటనే పూర్తి చేయాలి (CPM రైతు సంఘాలు)
February 14, 2026 08:38 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకోరా_ మాటూరి బాలరాజు గౌడ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రైతు సంఘం సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో....

ఆత్మకూరు: మండలంలోని తుక్కాపురం స్టేజి నుండి రహీంఖాన్ పేట ఖప్రాయ పల్లి, మోత్కూరు వరకు రోడ్డు నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రోజున ఆత్మకూరు మండలంలోని తుక్కాపురం కాప్రాయపల్లి మధ్యన రోడ్డు నిర్మాణం మధ్యలో వదిలేసి గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు, నాటి ఆలేరుఎమ్మెల్యే గొంగిడి సునీత నిధులతో రోడ్డు నిర్మాణ పనులు మంజూరు కాగా గత మూడు సంవత్సరాలుగా రోడ్డు నిర్మాణం పనులు నత్త నడకన సాగుతోందని ఇప్పటికే ఈ మార్గంలో అనేక ప్రమాదాలు జరిగే ప్రజలు కాళ్లు చేతులు విరిగి ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపారు.ఈ మార్గంలో ప్రమాదానికి గురై పోతిరెడ్డిపల్లికి చెందిన

మక్తల నవీను ప్రాణాలు కోల్పోయాడని,అదేవిధంగా హైదరాబాద్ కు సంబంధించిన ప్రయాణికులకు కాళ్లు చేతులు విరిగాయని ఈ ప్రాంతం గుండా వందలాది వాహనాలు,ప్రయాణికులు వాహనదారులు ప్రయాణిస్తున్నారని కానీ బస్సుల్లో వాహనాల్లో ప్రయాణించడంలో కుదుపులకు అనేకమందికి నడుములు పట్టేసి గాయాలపాలైతున్నారని నరక కూపంగా మారిన తుక్కాపురం స్టేజి నుండి రహీం ఖాన్ పేట వరకు రోడ్డు అతుకుల గతుకులతో గుంతల మయంగా మారిందన్నారు,అదేవిధంగా వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారని అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఇప్పటికైనాఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తక్షణమే పట్టించుకోని రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తుక్కాపురం స్టేజి వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానికి తమ ఆందోళన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వేముల బిక్షం,రైతు సంఘం మండల కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ రెడ్డి మహేష్ కే రాము కుమార్ ఏ వెంకన్న బుగ్గ రాములు శ్రీశైలం సత్తయ్య ఆ మార్గం గుండా వెళ్లే ప్రయాణికులు పాల్గొని రాస్తారోకోని నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News