ఆశీర్వదించండి...అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తా
ఆశీర్వదించండి...అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తా
K.RAVI
7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసార్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి
ఏడవ వార్డు అభివృద్దే శ్రేయస్సుగా భావించి వస్తున్నానని,తను ఆశీర్వదించి ఏడో వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని కోరుతూ ఏడవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని మున్సిపాలిటీలో మరింత అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఏడవ వార్డులో మరింత అభివృద్ధి సాధించి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికలలో చేయి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపిస్తే ఏడవ వార్డును మరింత అభివృద్ధి చేయడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఏ పార్టీకి కూడా మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే పరిస్థితి లేదన్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే ఏడవ వార్డు అభివృద్ధి సాధ్యమన్నారు. ఏడవ వార్డును ఆదర్శవార్డుగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు, కాంగ్రెస్ నాయకులు, యువత పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి