Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:54 PM

ఆశీర్వదించండి...అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తా

ఆశీర్వదించండి...అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తా

ఆశీర్వదించండి...అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తా
February 05, 2026 10:25 AM 115 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసార్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి

ఏడవ వార్డు అభివృద్దే శ్రేయస్సుగా భావించి వస్తున్నానని,తను ఆశీర్వదించి ఏడో వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని కోరుతూ ఏడవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని మున్సిపాలిటీలో మరింత అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఏడవ వార్డులో మరింత అభివృద్ధి సాధించి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికలలో చేయి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపిస్తే ఏడవ వార్డును మరింత అభివృద్ధి చేయడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఏ పార్టీకి కూడా మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే పరిస్థితి లేదన్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే ఏడవ వార్డు అభివృద్ధి సాధ్యమన్నారు. ఏడవ వార్డును ఆదర్శవార్డుగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు, కాంగ్రెస్ నాయకులు, యువత పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News