Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:08 PM

ఆశీర్వదించండి...అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తా

ఆశీర్వదించండి...అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తా

ఆశీర్వదించండి...అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తా
February 05, 2026 10:25 AM 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసార్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి

ఏడవ వార్డు అభివృద్దే శ్రేయస్సుగా భావించి వస్తున్నానని,తను ఆశీర్వదించి ఏడో వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని కోరుతూ ఏడవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని మున్సిపాలిటీలో మరింత అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఏడవ వార్డులో మరింత అభివృద్ధి సాధించి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికలలో చేయి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపిస్తే ఏడవ వార్డును మరింత అభివృద్ధి చేయడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఏ పార్టీకి కూడా మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే పరిస్థితి లేదన్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే ఏడవ వార్డు అభివృద్ధి సాధ్యమన్నారు. ఏడవ వార్డును ఆదర్శవార్డుగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు, కాంగ్రెస్ నాయకులు, యువత పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News