Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:22 PM

ఆశీర్వదించండి...అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తా

ఆశీర్వదించండి...అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తా

ఆశీర్వదించండి...అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తా
February 05, 2026 10:25 AM 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాసార్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి

ఏడవ వార్డు అభివృద్దే శ్రేయస్సుగా భావించి వస్తున్నానని,తను ఆశీర్వదించి ఏడో వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని కోరుతూ ఏడవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని మున్సిపాలిటీలో మరింత అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఏడవ వార్డులో మరింత అభివృద్ధి సాధించి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికలలో చేయి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపిస్తే ఏడవ వార్డును మరింత అభివృద్ధి చేయడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. ఏ పార్టీకి కూడా మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే పరిస్థితి లేదన్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే ఏడవ వార్డు అభివృద్ధి సాధ్యమన్నారు. ఏడవ వార్డును ఆదర్శవార్డుగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు, కాంగ్రెస్ నాయకులు, యువత పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News