పిల్లలమర్రి మధుసూదన్ 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి
చౌటుప్పల్ మున్సిపాలిటీ 19వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీర్వాదంతో పిల్లలమర్రి మధుసూదన్ నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19వ వార్డులో ప్రధాన సమస్యలు నాకు అవకాశం ఇస్తే మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో గెలిచిన మూడు నెలల లోపు పూర్తి చేస్తానని,అధికార పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే అభివృద్ధి తొందరగా జరుగుతుంది అని అన్నారు.19వ వార్డు ప్రజలు మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. నేను నాయకుడిగా కాదు మీ సేవకుడిగా మీ ముందుకు వస్తున్నాను ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తాను.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి