Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:45 PM

ఆశా కార్యకర్తల అరెస్టులు : ప్రజాస్వామ్యంపై దాడి

ఆశా కార్యకర్తల అరెస్టులు : ప్రజాస్వామ్యంపై దాడి

ఆశా కార్యకర్తల అరెస్టులు : ప్రజాస్వామ్యంపై దాడి
December 29, 2025 01:12 PM 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తమ సమస్యలపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఆశా కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తిరుమలగిరి పోలీస్ పరిధిలో ఆశా కార్యకర్తల ఇళ్లకు వెళ్లిన పోలీసులు, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ చర్య ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆశా కార్యకర్తలు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపే మౌలిక హక్కును కాలరాస్తూ పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే నిరసనకు పిలుపునిచ్చామని, కానీ భయభ్రాంతులకు గురిచేయాలన్న ఉద్దేశంతోనే అక్రమ అరెస్టులు చేశారని విమర్శించారు. ప్రజా ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నాలను తాము ఖండిస్తున్నామని ఆశా కార్యకర్తలు స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News