ఆశా కార్యకర్తల అరెస్టులు : ప్రజాస్వామ్యంపై దాడి
ఆశా కార్యకర్తల అరెస్టులు : ప్రజాస్వామ్యంపై దాడి
Biksham
సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తమ సమస్యలపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఆశా కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తిరుమలగిరి పోలీస్ పరిధిలో ఆశా కార్యకర్తల ఇళ్లకు వెళ్లిన పోలీసులు, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ చర్య ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆశా కార్యకర్తలు మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపే మౌలిక హక్కును కాలరాస్తూ పోలీసులు వ్యవహరించారని ఆరోపించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే నిరసనకు పిలుపునిచ్చామని, కానీ భయభ్రాంతులకు గురిచేయాలన్న ఉద్దేశంతోనే అక్రమ అరెస్టులు చేశారని విమర్శించారు. ప్రజా ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నాలను తాము ఖండిస్తున్నామని ఆశా కార్యకర్తలు స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి