Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:14 PM

ఆరోగ్యానికి ‘కదలికే’ శ్రీరామరక్ష: గంటల తరబడి కూర్చోవడం ధూమపానం కన్నా ప్రమాదం!

ఆరోగ్యానికి ‘కదలికే’ శ్రీరామరక్ష: గంటల తరబడి కూర్చోవడం ధూమపానం కన్నా ప్రమాదం!

ఆరోగ్యానికి ‘కదలికే’ శ్రీరామరక్ష: గంటల తరబడి కూర్చోవడం ధూమపానం కన్నా ప్రమాదం!
February 05, 2026 06:42 PM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar

సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ నిపుణులు డాక్టర్ శ్రీకరణ్ ఉద్దేశ్ హెచ్చరిక; జీవనశైలి మార్పులతోనే దీర్ఘకాలిక వ్యాధులకు చెక్

నేటి యాంత్రిక జీవనంలో శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం, మధుమేహం (డయాబెటిస్), రక్తపోటు (బిపి) వంటి జీవనశైలి వ్యాధులు మహమ్మారిలా విస్తరిస్తున్నాయని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ జనరల్ మెడిసిన్ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ శ్రీకరణ్ ఉద్దేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆధునిక కాలంలో గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం ‘కొత్త రకపు ధూమపానం’ లాంటిదని, ఇది గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చని ఆయన సూచించారు. ఆఫీసుల్లో పనిచేసే వారు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకుని కాసేపు అటు ఇటు నడవాలి. ప్రతిరోజూ కనీసం 8,000 అడుగులు నడవడం అలవాటు చేసుకోవాలి. వేగంగా నడవడమే శ్రేయస్కరం. వారానికి కనీసం 75 నిమిషాల పాటు తీవ్రమైన వ్యాయామం, అలాగే వారానికి రెండు సార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ (కండరాల దృఢత్వం) తప్పనిసరి. రోజుకు కనీసం 7 గంటల గాఢ నిద్ర అవసరం. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం వల్ల శరీర జీవ గడియారం క్రమబద్ధంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన గుండె కోసం ఆహారపు అలవాట్లలో మార్పులు సూచించారు. వంటల్లో ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వాడటం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. రెడ్ మీట్ (ఎర్ర మాంసం) తగ్గించి, మొక్కల ఆధారిత ప్రోటీన్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాసెస్ చేసిన ఆహారం , అధిక కొలెస్ట్రాల్ ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. వ్యాధి వచ్చాక చికిత్స కంటే రాకముందే మేల్కొనడం ఉత్తమమని డాక్టర్ ఉద్దేశ్ తెలిపారు. క్రమం తప్పకుండా ఫిజీషియన్‌ను సంప్రదించి హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని, తద్వారా రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలను తొలిదశలోనే గుర్తించి ప్రాణాలను కాపాడుకోవచ్చని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య సిబ్బంది మరియు ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News