Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 11:43 PM

ఆరవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా వేముల వీరేశం ప్రచారం

ఆరవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా వేముల వీరేశం ప్రచారం

ఆరవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా వేముల వీరేశం ప్రచారం
07-02-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ నియోజకవర్గం – చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికలు

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 06వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జెర్రీపోతుల సత్యనారాయణకు మద్దతుగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెయ్యి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వెంకటపూరం పరిధిలో ఇండ్లు లేని ప్రతి పేద కుటుంబానికి తప్పనిసరిగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వార్డులో నెలకొన్న విద్యుత్తు సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని, సిసి రోడ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

గత ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క పేద కుటుంబానికీ ఇల్లు ఇవ్వలేదని విమర్శించిన ఆయన, ప్రజలను మభ్యపెట్టిన పాలనకు ఈ ఎన్నికలే తగిన సమాధానం కావాలని అన్నారు. జెర్రీపోతుల సత్యనారాయణను గెలిపిస్తే 06వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు.

ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టి, సామాజిక కార్యక్రమాలు, సమావేశాలకు ఉపయోగపడేలా చేస్తామని తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని, ప్రజల ఆశీర్వాదంతో విజయమే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.



Sthanikam

ఆరవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా వేముల వీరేశం ప్రచారం

Article Image

నకిరేకల్ నియోజకవర్గం – చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికలు

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 06వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జెర్రీపోతుల సత్యనారాయణకు మద్దతుగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెయ్యి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వెంకటపూరం పరిధిలో ఇండ్లు లేని ప్రతి పేద కుటుంబానికి తప్పనిసరిగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వార్డులో నెలకొన్న విద్యుత్తు సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని, సిసి రోడ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

గత ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క పేద కుటుంబానికీ ఇల్లు ఇవ్వలేదని విమర్శించిన ఆయన, ప్రజలను మభ్యపెట్టిన పాలనకు ఈ ఎన్నికలే తగిన సమాధానం కావాలని అన్నారు. జెర్రీపోతుల సత్యనారాయణను గెలిపిస్తే 06వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు.

ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టి, సామాజిక కార్యక్రమాలు, సమావేశాలకు ఉపయోగపడేలా చేస్తామని తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని, ప్రజల ఆశీర్వాదంతో విజయమే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News