ఆరవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా వేముల వీరేశం ప్రచారం
ఆరవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా వేముల వీరేశం ప్రచారం
Komidala Mahender reddy
నకిరేకల్ నియోజకవర్గం – చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికలు
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 06వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జెర్రీపోతుల సత్యనారాయణకు మద్దతుగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెయ్యి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వెంకటపూరం పరిధిలో ఇండ్లు లేని ప్రతి పేద కుటుంబానికి తప్పనిసరిగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వార్డులో నెలకొన్న విద్యుత్తు సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని, సిసి రోడ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
గత ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క పేద కుటుంబానికీ ఇల్లు ఇవ్వలేదని విమర్శించిన ఆయన, ప్రజలను మభ్యపెట్టిన పాలనకు ఈ ఎన్నికలే తగిన సమాధానం కావాలని అన్నారు. జెర్రీపోతుల సత్యనారాయణను గెలిపిస్తే 06వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు.
ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టి, సామాజిక కార్యక్రమాలు, సమావేశాలకు ఉపయోగపడేలా చేస్తామని తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని, ప్రజల ఆశీర్వాదంతో విజయమే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి