Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:11 AM

ఆరవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా వేముల వీరేశం ప్రచారం

ఆరవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా వేముల వీరేశం ప్రచారం

ఆరవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా వేముల వీరేశం ప్రచారం
February 07, 2026 11:26 AM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ నియోజకవర్గం – చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికలు

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 06వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి జెర్రీపోతుల సత్యనారాయణకు మద్దతుగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెయ్యి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వెంకటపూరం పరిధిలో ఇండ్లు లేని ప్రతి పేద కుటుంబానికి తప్పనిసరిగా ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వార్డులో నెలకొన్న విద్యుత్తు సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని, సిసి రోడ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

గత ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క పేద కుటుంబానికీ ఇల్లు ఇవ్వలేదని విమర్శించిన ఆయన, ప్రజలను మభ్యపెట్టిన పాలనకు ఈ ఎన్నికలే తగిన సమాధానం కావాలని అన్నారు. జెర్రీపోతుల సత్యనారాయణను గెలిపిస్తే 06వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు.

ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టి, సామాజిక కార్యక్రమాలు, సమావేశాలకు ఉపయోగపడేలా చేస్తామని తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని, ప్రజల ఆశీర్వాదంతో విజయమే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News