ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం డిమాండ్ డే
ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం డిమాండ్ డే
Biksham Goud
సూర్యాపేట డిపోలో బ్యాడ్జీలు ధరించి నిరసన
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి డిమాండ్ డే కార్యక్రమాన్ని సూర్యాపేట డిపోలో నిర్వహించారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్మికులు బ్యాడ్జీలు ధరించి తమ డిమాండ్లను తెలియజేశారు. ఆర్టీసీ కార్మికులకు రెండు వేల ఇరవై ఒకటి, రెండు వేల ఇరవై ఐదు వేతన సవరణలు వెంటనే చేయాలని, కార్మికుల హక్కులను కాలరాస్తున్న లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని, కార్మిక సంఘాల కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని కోరారు.విద్యుత్ బస్సుల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీలకు అవకాశాలు కల్పించాలని, రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రాష్ట్రంలో అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి