Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 03:31 AM

ఆర్‌కే పురం ఫ్లైఓవర్ రీ–అలైన్‌మెంట్

ఆర్‌కే పురం ఫ్లైఓవర్ రీ–అలైన్‌మెంట్

ఆర్‌కే పురం ఫ్లైఓవర్ రీ–అలైన్‌మెంట్
January 23, 2026 09:11 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Malkajgiri mandal
Prabhakar

స్థానిక ప్రతినిధి మల్కాజ్గిరి పి ప్రభాకర్

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆర్‌కే పురం ఫ్లైఓవర్ రీ–అలైన్‌మెంట్ అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్‌కే పురం ఫ్లైఓవర్‌ను రీ–అలైన్‌మెంట్ చేయడం వల్ల పరిసర ప్రాంతాలైన పల్లవి విల్లా అపార్ట్‌మెంట్ వాసులు, స్థానిక దుకాణదారులు, అలాగే ఆర్మీ డిఫెన్స్ ల్యాండ్‌లో నివసిస్తున్న పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తగ్గేలా ఫ్లైఓవర్ రీ–అలైన్‌మెంట్ చేపట్టాలని కోరుతూ సంబంధిత అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు.

దీనిపై స్పందించిన జీహెచ్ఎంసి ప్రాజెక్టు అధికారులు, సమస్యను సానుకూలంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, సూపరింటెండింగ్ ఇంజనీర్ రోహిణి, డిప్యూటీ ఇంజనీర్ రేణుక, అసిస్టెంట్ ఇంజనీర్‌లు వెంకట్ రెడ్డి, సుజిత్, అలాగే కాలనీ వాసులు బి.టి. శ్రీనివాస్, సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News