13 వ సారి రక్తదానం చేసిన రాజు
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి
సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి గ్రామానికి చెందిన జక్కలి నాగరాజు శనివారం 13వ సారి రక్తదానం చేశారు. హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం యాతవాకిల్ల గ్రామానికి చెందిన మాలోతు దివ్య డెలివరీ నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రి లో చేరగా బి నెగిటివ్ రక్తం అవసరమని బంధువులు సమాచారం సోషల్ మీడియా లో పంపగా స్పందించి రక్తదానం చేశారు. ఆపదలో ఉన్న ఎవరైనా తన దృష్టికి రాగానే వెంటనే స్పందించి రక్త దానం చేస్తున్న నాగరాజు ను పలువురు అభినందించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి