Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:07 AM

ఆలయాభివృద్ధికి దైద రవీందర్ రూ.10,116 విరాళం

ఆలయాభివృద్ధికి దైద రవీందర్ రూ.10,116 విరాళం

 ఆలయాభివృద్ధికి దైద రవీందర్ రూ.10,116 విరాళం
26-12-2025 356 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మండలపూజ

ఆలయాభివృద్ధికి రూ.10,116 విరాళం

స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో శ్రీ శ్రీ శ్రీ హరి హరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన 34వ మండలపూజతో పాటు స్వామివారి అభిషేక పూజ మహోత్సవం శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దైద రవీందర్ స్వామివారి విశిష్టత, భక్తి–నియమాల ప్రాధాన్యతను భక్తులకు వివరించారు. అయ్యప్ప స్వామి బోధనలు సమాజంలో ఆత్మనియంత్రణ, సేవాభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారంగా రూ.10,116 (పదివేల నూట పదహారు రూపాయలు) ఆర్థిక సహాయాన్ని ఆలయ కమిటీకి అందజేశారు.

మండలపూజ, అభిషేక పూజల్లో పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా, పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వామి భక్తులు విశేషంగా కృషి చేశారు.

Sthanikam

ఆలయాభివృద్ధికి దైద రవీందర్ రూ.10,116 విరాళం

Article Image

నకిరేకల్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మండలపూజ

ఆలయాభివృద్ధికి రూ.10,116 విరాళం

స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో శ్రీ శ్రీ శ్రీ హరి హరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన 34వ మండలపూజతో పాటు స్వామివారి అభిషేక పూజ మహోత్సవం శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దైద రవీందర్ స్వామివారి విశిష్టత, భక్తి–నియమాల ప్రాధాన్యతను భక్తులకు వివరించారు. అయ్యప్ప స్వామి బోధనలు సమాజంలో ఆత్మనియంత్రణ, సేవాభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారంగా రూ.10,116 (పదివేల నూట పదహారు రూపాయలు) ఆర్థిక సహాయాన్ని ఆలయ కమిటీకి అందజేశారు.

మండలపూజ, అభిషేక పూజల్లో పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా, పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వామి భక్తులు విశేషంగా కృషి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News