ఆలయాభివృద్ధికి దైద రవీందర్ రూ.10,116 విరాళం
ఆలయాభివృద్ధికి దైద రవీందర్ రూ.10,116 విరాళం
స్థానికం బృందం
నకిరేకల్లో ఘనంగా అయ్యప్ప స్వామి మండలపూజ
ఆలయాభివృద్ధికి రూ.10,116 విరాళం
స్థానికం ప్రతినిధి
నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో శ్రీ శ్రీ శ్రీ హరి హరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన 34వ మండలపూజతో పాటు స్వామివారి అభిషేక పూజ మహోత్సవం శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దైద రవీందర్ స్వామివారి విశిష్టత, భక్తి–నియమాల ప్రాధాన్యతను భక్తులకు వివరించారు. అయ్యప్ప స్వామి బోధనలు సమాజంలో ఆత్మనియంత్రణ, సేవాభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారంగా రూ.10,116 (పదివేల నూట పదహారు రూపాయలు) ఆర్థిక సహాయాన్ని ఆలయ కమిటీకి అందజేశారు.
మండలపూజ, అభిషేక పూజల్లో పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా, పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వామి భక్తులు విశేషంగా కృషి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి