Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి: ఎంపీ ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పిం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:31 PM

ఆలయాభివృద్ధికి దైద రవీందర్ రూ.10,116 విరాళం

ఆలయాభివృద్ధికి దైద రవీందర్ రూ.10,116 విరాళం

 ఆలయాభివృద్ధికి దైద రవీందర్ రూ.10,116 విరాళం
December 26, 2025 01:18 PM 346 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్‌లో ఘనంగా అయ్యప్ప స్వామి మండలపూజ

ఆలయాభివృద్ధికి రూ.10,116 విరాళం

స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో శ్రీ శ్రీ శ్రీ హరి హరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన 34వ మండలపూజతో పాటు స్వామివారి అభిషేక పూజ మహోత్సవం శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దైద రవీందర్ స్వామివారి విశిష్టత, భక్తి–నియమాల ప్రాధాన్యతను భక్తులకు వివరించారు. అయ్యప్ప స్వామి బోధనలు సమాజంలో ఆత్మనియంత్రణ, సేవాభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారంగా రూ.10,116 (పదివేల నూట పదహారు రూపాయలు) ఆర్థిక సహాయాన్ని ఆలయ కమిటీకి అందజేశారు.

మండలపూజ, అభిషేక పూజల్లో పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా, పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వామి భక్తులు విశేషంగా కృషి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News