Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:54 PM

ఆగిరిపల్లి లో అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం (ఐప్వా) ఆవిర్భావ దినోత్సవ సందర్భంగ జెండా ఆవిష్కరించడం జరిగింది

ఆగిరిపల్లి లో అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం (ఐప్వా) ఆవిర్భావ దినోత్సవ సందర్భంగ జెండా ఆవిష్కరించడం జరిగింది

ఆగిరిపల్లి లో  అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం (ఐప్వా)  ఆవిర్భావ దినోత్సవ సందర్భంగ జెండా  ఆవిష్కరించడం జరిగింది
February 12, 2026 07:27 PM 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి లో

అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం (ఐప్వా) ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్ ఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేముల బక్కయ్య మాట్లాడుతూ దేశంలో ఆర్ఎస్ఎస్ – బిజెపి అధికారం చేపట్టిన దగ్గర నుంచి దేశంలో మహిళలపై దాడులు తీవ్రస్థాయిలో పెరిగాయని, మహిళలపై దాడులు, హత్యాచారాలు, హత్యలు చేసిన దోషులను కఠినంగా శిక్షించడానికి బదులు వారికి అండగా నిలబడుతూ వారిని పూలదండలతో సన్మానించడం ఆర్ఎస్ఎస్ – మోడీ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ – బిజెపి ప్రభుత్వం మహిళలను మనువాద దృక్పథంతో చూస్తూ కించపరిచే చర్యలు చేపడుతుందని ఆరోపించారు. మోడీ విధానాలనే రాష్ట్రంలో తూచతప్పకుండా అనుసరిస్తున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం మహిళా వ్యతిరేక చర్యలను విమర్శించారు. ప్రతి నెల మహిళలకు ఇస్తారన్న 1500 రూపాయలు హామీ, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తానన్న హామీలను ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేసారని ఆరోపించారు. ఈ చర్యలను మహిళలు ముక్తకంఠంతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. తక్షణం మహిళా రక్షణ చట్టాలను అమలు చేసి దోషులు కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని బక్కయ్య ప్రభుత్వం డిమాండ్ చేశారు. కేంద్రంలో ఆర్ఎస్ఎస్ – బిజెపి ప్రభుత్వం ఏకపక్షంగా అమలు చేస్తున్న మతతత్వ, మనువాద, మహిళా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 20వ తేదీన "ఐప్వా" ఆధ్వర్యంలో తెనాలిలో "రాష్ట్ర సదస్సు" జరుగుతుందని ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా "ఐప్వా" జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మీనా తివారి హాజరవుతున్నారని ఈ సదస్సులో అన్ని వర్గాల మహిళలు పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని, అలాగే మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, సమాన పనికి – సమాన వేతనం ఇవ్వాలని, పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ చట్టాలు అమలు చేయాలని, మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారం, హత్యలు చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని, వాటిని అరికట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా నాయకులు పల్లె పాము భవాని, కలపాల రాణి ,రాధమ్మ ,మంగమ్మ, గంగ, లలిత, ఏసమ్మ, రాములమ్మ ,బూచమ్మ ,భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News