ఆదరించండి.. అభివృద్ధే నా అజెండా
ఆదరించండి.. అభివృద్ధే నా అజెండా
Biksham
ప్రజల సేవకుడిగా నిలుస్తా
12వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి రాపర్తి మహేష్ కుమార్ ధీమా
సూర్యాపేట సిటీ, తనను
ఆదరించి గెలిపించినట్లయితే 12వ వార్డును అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తూ ప్రజల నిజమైన సేవకుడిగా పనిచేస్తానని 12వ వార్డు కౌన్సిలర్ బిఆర్ఎస్ అభ్యర్థి రాపర్తి మహేష్ కుమార్ స్పష్టం చేశారు.శుక్రవారం పిల్లలమర్రి ప్రాంతం నుంచి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా తరలివచ్చిన మహేష్ కుమార్ ఉత్సాహభరిత నినాదాల మధ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈ ర్యాలీతో 12వ వార్డులో బిఆర్ఎస్ బలాన్ని మరోసారి చాటిచెప్పినట్లయ్యింది.
నామినేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత పదేళ్లుగా పిల్లలమర్రి ప్రజలకు అండగా నిలుస్తూ వారి ప్రతి సమస్యను తన సమస్యగా భావించి పరిష్కారానికి కృషి చేశానన్నారు. ప్రజలతో నిత్యం మమేకమై ఉండే నాయకుడిగా తాను గుర్తింపు పొందానని తెలిపారు.
బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహకారంతో సూర్యాపేట పట్టణం అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, సంక్షేమ పథకాల అమలులో బిఆర్ఎస్ పాలన చరిత్ర సృష్టించిందని అన్నారు.
ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, అభివృద్ధి – సంక్షేమమే తమ ఆయుధమని స్పష్టం చేశారు. ఇప్పటివరకు చేసిన సేవలను ప్రజలు
గమనిస్తున్నారని, మరోసారి అవకాశం ఇస్తే 12వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు.తనకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, బిఆర్ఎస్కు ఓటు వేసి ఘన విజయం అందించాలని 12వ వార్డు ప్రజలను ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, యువజన విభాగం నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి