Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:05 AM

నాడు భర్త ఓటమి… నేడు భార్య గెలుపు

నాడు భర్త ఓటమి… నేడు భార్య గెలుపు

నాడు భర్త ఓటమి… నేడు భార్య గెలుపు
16-12-2025 203 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ఆశా వర్కర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచిగా ఘన విజయం

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పులిపలుపుల సునీత సర్పంచిగా ఘన విజయం సాధించారు. 303 ఓట్ల భారీ మెజార్టీతో ఆమె గెలుపొందడం గ్రామ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

గత ఎన్నికల్లో సునీత భర్త వీరస్వామి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి అదే కుటుంబానికి చెందిన సునీత ప్రజల విశ్వాసాన్ని చూరగొని గెలుపు సాధించడం విశేషం. ఆశా వర్కర్‌గా పనిచేస్తున్న సునీత ఎన్నికల బరిలో నిలవాలనే సంకల్పంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లారు. ఇంటింటి ప్రచారం, ప్రజా సమస్యలపై అవగాహన, అందుబాటులో ఉండే నాయకత్వం ఆమెకు కలిసొచ్చినట్టు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

మహిళా నాయకత్వానికి గ్రామస్తులు ఇచ్చిన మద్దతుగా ఈ ఫలితాన్ని విశ్లేషిస్తున్నారు. గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాలపై స్పష్టమైన హామీలతో ముందుకెళ్లిన సునీత విజయం లక్ష్మాపురంలో కొత్త ఆశలకు నాంది పలికింది

Sthanikam

నాడు భర్త ఓటమి… నేడు భార్య గెలుపు

Article Image
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ఆశా వర్కర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచిగా ఘన విజయం

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పులిపలుపుల సునీత సర్పంచిగా ఘన విజయం సాధించారు. 303 ఓట్ల భారీ మెజార్టీతో ఆమె గెలుపొందడం గ్రామ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

గత ఎన్నికల్లో సునీత భర్త వీరస్వామి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి అదే కుటుంబానికి చెందిన సునీత ప్రజల విశ్వాసాన్ని చూరగొని గెలుపు సాధించడం విశేషం. ఆశా వర్కర్‌గా పనిచేస్తున్న సునీత ఎన్నికల బరిలో నిలవాలనే సంకల్పంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లారు. ఇంటింటి ప్రచారం, ప్రజా సమస్యలపై అవగాహన, అందుబాటులో ఉండే నాయకత్వం ఆమెకు కలిసొచ్చినట్టు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

మహిళా నాయకత్వానికి గ్రామస్తులు ఇచ్చిన మద్దతుగా ఈ ఫలితాన్ని విశ్లేషిస్తున్నారు. గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాలపై స్పష్టమైన హామీలతో ముందుకెళ్లిన సునీత విజయం లక్ష్మాపురంలో కొత్త ఆశలకు నాంది పలికింది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News