నాడు భర్త ఓటమి… నేడు భార్య గెలుపు
నాడు భర్త ఓటమి… నేడు భార్య గెలుపు
స్థానికం బృందం
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
ఆశా వర్కర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచిగా ఘన విజయం
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పులిపలుపుల సునీత సర్పంచిగా ఘన విజయం సాధించారు. 303 ఓట్ల భారీ మెజార్టీతో ఆమె గెలుపొందడం గ్రామ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
గత ఎన్నికల్లో సునీత భర్త వీరస్వామి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి అదే కుటుంబానికి చెందిన సునీత ప్రజల విశ్వాసాన్ని చూరగొని గెలుపు సాధించడం విశేషం. ఆశా వర్కర్గా పనిచేస్తున్న సునీత ఎన్నికల బరిలో నిలవాలనే సంకల్పంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లారు. ఇంటింటి ప్రచారం, ప్రజా సమస్యలపై అవగాహన, అందుబాటులో ఉండే నాయకత్వం ఆమెకు కలిసొచ్చినట్టు రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
మహిళా నాయకత్వానికి గ్రామస్తులు ఇచ్చిన మద్దతుగా ఈ ఫలితాన్ని విశ్లేషిస్తున్నారు. గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాలపై స్పష్టమైన హామీలతో ముందుకెళ్లిన సునీత విజయం లక్ష్మాపురంలో కొత్త ఆశలకు నాంది పలికింది

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి