Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:23 PM

నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థులకు బ్రహ్మరథం

నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థులకు బ్రహ్మరథం

నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థులకు బ్రహ్మరథం
December 16, 2025 12:45 AM 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వెల్లువెత్తుతున్న ప్రజల మద్దతు

నారాయణఖేడ్, ప్రతినిధి:

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గ్రామ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నగల్ గిద్ద మండల పరిధిలోని వల్లూర, ముక్తాపూర్, లింగాపూర్, మాధ్వర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల ప్రచారంలో భాగంగా నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే అనేక మంది పేదలకు కొత్త రేషన్ కార్డులు అందాయని తెలిపారు. ఇది కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే ప్రజల విశ్వాసానికి కారణమని పేర్కొన్న ఎమ్మెల్యే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నందుకు మండల ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అంకితభావంతో పని చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఇండ్లు లేని నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేపట్టామని స్పష్టం చేశారు.

రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు గ్రామ ముఖ్య కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News