Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:33 AM

నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థులకు బ్రహ్మరథం

నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థులకు బ్రహ్మరథం

నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థులకు బ్రహ్మరథం
December 16, 2025 12:45 AM 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వెల్లువెత్తుతున్న ప్రజల మద్దతు

నారాయణఖేడ్, ప్రతినిధి:

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నారాయణఖేడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గ్రామ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నగల్ గిద్ద మండల పరిధిలోని వల్లూర, ముక్తాపూర్, లింగాపూర్, మాధ్వర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల ప్రచారంలో భాగంగా నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే అనేక మంది పేదలకు కొత్త రేషన్ కార్డులు అందాయని తెలిపారు. ఇది కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలే ప్రజల విశ్వాసానికి కారణమని పేర్కొన్న ఎమ్మెల్యే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నందుకు మండల ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అంకితభావంతో పని చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, ఇండ్లు లేని నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేపట్టామని స్పష్టం చేశారు.

రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు గ్రామ ముఖ్య కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News